పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాస్త్రజ్ఞానం యావత్తూ నాలుగు ముక్కలలో చెప్పి, భగవద్భావానికి ఆ శాస్త్రం ఎందుకు అవసరమో నిరూపిద్దామని ప్రారంభించాను.

   జమీం : చిత్తం  స్వామీజీ! మీరు కానీయండి. నాకు శక్తి  ఉన్నంత మట్టుకు  వింటాను. లేకపోతే చల్లగావెళ్ళి పడుకుంటాను.
   నాలుగు  : శాస్త్ర సత్యాలను  వివరించడంలో  సంపూర్ణ, అంటే  చరిత్ర రూపమైన, వివరణ చేస్తుంది.  విశ్వం  ఎప్పుడూ  స్పందిస్తోంది, మారుతోంది. శాస్త్రం  సత్యం చెప్పేటప్పుడు  ఒక పదార్ధమూ, ఇంకోపదార్ధమూ, పదార్ధమూ, శక్తీ  పరస్పరంగా మార్పులు  తీసుకువస్తాయి అన్నప్పుడు  సూర్యకుటుంబ, నక్షత్ర చరిత్రలు కలుపుకొని  చెబుతూ ఉండాలి. అయిదు : రసాయన భౌతిక శాస్త్రాలలో ఏలాగు , ఏది అని మాత్రం ప్రశ్నలు వస్తాయి. జీవ, మానసిక  శాస్త్రాలలో ఎందుకు అన్న ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది. ఆరు : శాస్త్రం ఎందుకు  అన్న ప్రశ్నకు  జవాబు ఇవ్వాలి. ఆ  జవాబు  పూర్ణం  కాకపోవచ్చును. ఇది అయివుండవచ్చును  అను ప్రత్యక్షవాదాఢారము       (ఎంపిరిసిజం), పూర్వవాదానుమానాధారము (ఎప్రయోరీ) అయివుంటుంది. ఏడు : శాస్త్ర ప్రశ్నలు, ఏమిటిది ఇది ఎలా జరుగును?  ఏ విధంగా  సంభవించింది? దీని చరిత్ర ? ఈవిధంగా  వుంటాయి.
   ఈవిషయం  దగ్గరకు వచ్చేసరికి  మూర్తీ, నేనూ  చిన్నపులి  అఱుపు  విన్నాము. అతడు  ఉలికిపడ్డాడు. జమీందారుడు గుఱ్ఱు పెట్టి  నిద్రపోతున్నాడు. అది గమనించి  శ్రీనాథమూర్తి పకపక  నవ్వాడు. అతన్ని పడుకోమని  నేను యోగాభ్యాసం  ప్రారంభించాను.
   
                                                                                                                 9
   
   విద్యుచ్చక్తి , అయస్కాంతం  దగ్గరకు  ఎక్కువ  చలనం  పొందినట్లుగా, కైలసేశ్వరుని సమీపించిన కొలదీ  మాలో  విషయ  విచారణ  ఎక్కువైంది. ఎక్కువ సన్నిహిత సంబంధాలున్న మూడు విభాగాలవుతుంది  మానవ చైతన్యం. భౌతిక  ప్రపంచం  ఏమిటి  అని తెలుసుకోవడం  ప్రకృతిలో  ఉన్న  అద్భుతదృశ్యాలు ,  సంఘటనవల్ల  మానవునిలో  హృదయం స్పందించి,  సౌందర్య పిపాస  రేకెత్తి  ఆనందం కలగడం, భౌతికాతీతమైన  భగవంతుని  లీలలో  తన్మయత్వం  పొందడం. ఈ  మూడు  మానవ చైతన్యాలకూ వ్యతిరేక  స్వరూపాలు  కూడా స్పందన  భాగాలే. శాస్త్రం ఖండసత్యం  అని వాదించడం, శాస్త్రం లొంగకపోవడం, లలిత కళలు  మానవనీరసత్వం  అన్నవాదన, భగవంతుడు  లేడనువాదన.                                                                                                                             
           
               

మర్నాడు తెల్లవారగట్ల మా ప్రయాణం సాగింది. మేమందరము ఏదో అనిర్వచనీయమైన ఆనందంలో మునిగిపోయాము. కైలాసపర్వత ప్రకాశం మా జన్మలనంతా ఆస్లావిస్తున్నది. ఆ తేజస్సు మా జీవితంలో ప్రతి అణువునా ప్రసరిస్తున్నది. తత్కారణరూపమైన దివ్యమత్తత మమ్మల్ని అలమిపోయింది. కైలాసపర్వతముఒక మహాదేవాలయంలా వుంటుంది. విమానం, ముఖమండపము అన్నీ కలిపి ఒక పరమ నిర్మాణం.