ఈ పుటను అచ్చుదిద్దలేదు
అని నన్నే పట్టుకున్నారు. నాకు వాళ్ళు నిజమైన గంధర్వ, కిన్నెరీ, యక్షబాలికలై తోచారు.
నాలో కామవాంఛ, కాశీలో మణికర్ణికా ఘట్టంలోనే మాయమైంది. అనాచ్ఛాదిత స్త్రీమూర్తి సౌందర్య సందర్శనాకాంక్ష పూర్తిగా నన్ను నిండిపోయింది. లోయలో ప్రవహించే నదీ సౌందర్యానికీ, ఈ పర్వత వర్ధనుర సౌందర్యానికీ ఏదో విచిత్రసామ్యం కనిపించింది. స్త్రీ మూర్తివినా నాకా పర్వతంలో ఏదీ పులకరాలు కలుగజేయలేదు. స్వామిజీ ఈ మార్పు చూస్తూనే ఉన్నారని నా అభిప్రాయం. ఏమీ చూడనట్టే కనబడ్డారు. ఆ విలక్షణ సౌందర్యం విన్నా నాకా క్షేత్రాలు అర్థరహిత మయ్యాయి.
మా దారి వెంబడిలో ఎక్కువమంది బదరీనాథం నుంచి తిరిగి వచ్చినవారే కనబడ్డారు. కొందరు గంగోత్రి వెళ్ళ సంకల్పించుకొన్నవారు, కొందరు కేదార యాత్రోన్ముఖులు. కొంచెం పొద్దేక్కునప్పటికీ నంద ప్రయాగ చేరాము. నందప్రయాగలో సాయంకాలం వరకూ ఉండి, ఆ పెద్ద గ్రామం పూర్తిగా దర్శించాను. ఆ పర్వత వాసుల జీవితం కనుగొనడమే నా ఉద్దేశం. నందప్రయాగ దగ్గర నందానది అలకనందలో చేరుతుంది. సాయంకాలానికి కోహాడ్ చేరాము. 36
ఉదయమే చమోలీ చేరి, అక్కడ బసచేసి చీకటిపడేవేళకు మత్ చట్టీ చేరాము. మత్ చట్టీ పరిసరాలన్నీ తోటలే. ఇక్కడ నుంచి హిమాలయాలని పిలువచ్చును. అక్కడ ఆ రాత్రి మకాంచేసి, తెల్లవారగట్లకు సియాసీన్ చేరాము. అచ్చట హిమవత్పర్వత సౌందర్యం కొంచెం రుచి చూడ ప్రారంభించాను. అలకనంద రెండు ఎత్తయిన పర్వతాల మధ్య నుండి అత్యంతాశ్చర్యకరంగా ప్రవహిస్తూంది.
నేను ఈ స్వాములతో, ఈ రాజపుత్ర జమీందారుతో కలిసి హిమాలయాలలో ప్రయాణం చేస్తూవుండడం నాకే ఆశ్చర్యం కలుగజేసింది. ఎందుకు ఈలా ప్రయాణమైనాను? ఎట్లా తీసుకురాగలిగారు ఈ స్వామీజీ? మా అమ్మ ఏదీ? ఈలాటి ఆలోచనలు ఎక్కువయ్యాయి. నేను హిమాలయ పర్వత శ్రేణిలో కరిగిపోతే? నా కేదైనా జబ్బుచేస్తే? పీడ విరగడై పోతుందికదా! ఈలా పరిణమించిందేమిటి నా చరిత్ర? నా ఆస్తినంతా అమ్ముకున్నాను, మా ఊళ్లో శకుంతల పేరిట విద్యాలయం కట్టమన్నాను. తాడూ, బొంగరం లేనివాణ్ణయ్యాను. నాకూ, లోకానికీ సంబంధం శకుంతలే. నాకూ, జీవితానికి నా శకుంతలాదేవే పెనవేసిన బంగారుత్రాడు. ఆ త్రాడు తెగిపోయిది. నేను త్రాడుతెగిన గాలిపటంలా ఆకాశాన ఎగురుతున్నాను. ఏ గాలి కొడితే ఆ గాలికి ఎగిరాను. ఇప్పుడీ కొండల్లో ఏ గాలికో కొట్టుకు వెడుతున్నాను.
హల్ చట్టీ, గరూల్ గంగా, పాతాళగంగా, గులాబ్ కోటీ, కుంబార్ చట్టీ చేరాము. హరిద్వారం దాటి 155 మైళ్ళు వచ్చాము. ఎదురుగుండా