ఈ పుటను అచ్చుదిద్దలేదు
నేను తెల్లబోయాను!
ఇంకొకతె: అపనే సడ్డాగీత్ సుణు! నాచ్ నా వేక్! అపనేఘర్ మే ఫలోందేవిచ్, కిసీ ఏక్ నూ చుణ్ లే! (మా సంగీతం విను! మా నాట్యం చూడు, మా ఇంట్లో మంచి పండ్లలో ఒక పండు రుచి చూడు)
అని అంటూ ఆ నలుగురూ నన్ను బరబరా తమ మేడమీదకు లాక్కొని పోయారు. అక్కడ నన్ను నలిపేశారు. నా జేబులో చేయిపెట్టి ఒకతె నా పర్సు లాగేసింది. అయిదారుగురు నాకు ఊపిరాడకుండా నులిమివేశారు. తుదకు ఒకతె ఓ సోణియో! త్వన్ను కాదేఢర్?(ఓ అందకాడా! ఎందుకు నీకు భయం) అంటూ దరిజేరింది. తక్కినవాళ్ళు నవ్వుకుంటూ తలుపు వేసేశారు. నాకు ముచ్చెమటలు పట్టాయి.
ఎలా లేచానో ఆ అమ్మాయిని తోసేసి; నాకేతెలియదు. గది గుమ్మం తెరచి, అక్కడ ఎవరూ లేనందుకు సంతోషిస్తూ, సగం ఏడుస్తూ వీధి గుమ్మం దగ్గరకు పరుగెత్తుకొని వచ్చాను. అక్కడ ఆ సిక్కుటాంగా సిద్దంగా ఉంది. అందులోకి ఉరికాను. ఆ చుట్టు ప్రక్కల మేడ వరండాలాలోనికి ఆడవాళ్ళందరూ మూగి పక పక నవ్వడం ప్రారంభించారు. ఆ శిక్కు టాంగామనిషి మాట్లాడకుండా మేం ఉన్న సత్రం దగ్గరకు తీసుకొని పోయాడు.
నేను ఇంట్లోకి వెళ్ళి ప్రాణం పోయినట్లు భావించుకొని, నా పరుపు వాల్చి, పండుకొని వెక్కివెక్కి ఏడ్చాను. నాకింతటి అవమానం కలగాలా? ఇది నాకు పరాభవమా? అవమానమా? నాలోని కోపం నన్ను దహించివేసింది, ఏం ప్రతీకారం చెయ్యగలను? కూడా పట్టుకువెళ్ళిన యాభై రూపాయలు పోతేపోయేయి, కాని వాళ్ళని నేను ఏమి చెయ్యగలను? ఆ హీరామండీ (రత్నాలవిఫణి) ఏమి రత్నాల బజారు?
ఆ నాడు నే ననుకోకపోయినా తర్వాత నన్ను నేను తర్కించు కొన్నప్పుడు మహాత్మాజీ స్త్రీ విషయంలో అన్న ముక్కలూ, మహాత్మాజీకి స్త్రీ మండలివారు సమర్పించుకొన్న మనవీ ఎన్నిసార్లో జ్ఞాపకం వచ్చాయి. ఆ రోజుల్లో పశువునై ఉన్న నాకు క్రోధమే ప్రధానమై నన్ను పూర్తిగా మండించింది. 27 లాహోరులో మూడురోజులు మాత్రమే ఉన్నాము. అక్కడినుంచి బయలుదేరి సింధునదీతీరంలో ఉన్న సుక్కూరుకు వెళ్ళాము. నా ప్రయాణాలకు అర్ధంలేదు. యాత్రావిశేషాలు చూడాలనీ కాదు, దేశంలోని ప్రసిద్ద ప్రదేశాలను చుద్దామనీ కాదు. నాలోని భరింపరాని వేదనే నన్ను ఎక్కడికో తరిమివేస్తున్నది. ఎక్కడికో అంతుదొరకని యాత్ర? ఎందుకీ అనంతమైన వేదన? నా శకుంతల నాకు ఎక్కడ ప్రత్యక్షం అవుతుంది?