ఈ పుటను అచ్చుదిద్దలేదు
అయితే సరే! నేను రేపే బయలుదేరి మా ఇంటికి వెడ్తాను. నువ్వు ఏమయితే, నాకేం గావాలి? కాని నీ విషయం తలచుకొని అత్తయ్య పడే వేదన చూస్తూంటే నా గుండె తరుక్కు పోతుంది.!
మా అమ్మా, మీనాన్నా నన్ను కాశీలో చచ్చిపోనివ్వకపోయారూ, బాధ విరగడై పోవునుగా? మీ కందరికీ ఒకటేమాట చెప్తున్నాను. నేను బతకాలని మీకుంటే నా దారిని పోనీయండి, లేదంటారా, ఇంత విషం తెచ్చి నాకు పెట్టండి!
మా సుబ్బులు ఒక్కసారిగా లేచి బొటబొట కన్నీళ్ళు కారుతూ ఉండగా క్రిందకు వెళ్ళిపోయాడు. నా కోపం ఆర్థ రాత్రి పన్నెండు గంటలవరకూ చల్లారలేదు.
ఓయి వెధవ దేవుళ్లోయి ఈ అవస్థ నాకేమిటఱ్ఱా! అని పొలికేక పెట్టాలని బుద్ది పుట్టింది నాకు.
26
ఇక కాశ్మీరంలో ఉండలేకపోయాను. మే నెల రెండవవారం ప్రవేశించింది. దేశం ఏమయితే నాకేం కావాలి? కాంగ్రెసు విజయం పొందకపోతే ఏమి కావాలి? స్వరాజ్య పార్టీ వారు శాసనసభల్లో మొగ్గలు వేస్తోంటే ఏమి కావాలి?
మా అమ్మ మరీ చిక్కిపోయింది. కాశ్మీరంనుంచి తిన్నగా బయలుదేరి లాహోరు వచ్చాము. లాహోరులో హిరానుండీ వెళ్ళి చూశాను. ప్రపంచంలో అంత ఘోరమైన భోగంవీధి లేదనుకుంటాను. ఆ మండీలోకి టంగామీదనే లాహోరు చేరిన మధ్యాహ్నం వెళ్ళాను. టంగావాడు ఒక శిక్కు సోదరుడు, నా వైపు దయార్ద్రదృష్టులు పరపి,
బాబూజీ! కీఖరాబ్ రాస్తే దేవిచ్ ఫజ్ర్ దేయా? (బాబుగారూ! చెడ్డతోవ పట్టారేమిటి?)
నేను మౌనం.
త్వడ్డీ జిందగీ దీలోడ్ నై?(జీవితం బాగుచేసుకోవాలనే ఉద్దేశము నీకు లేదా?)
నేను: చుప్ రాహ్. అప్ నీ కిస్మత్ దా బాదుషా మై యా తూ? (ఊరుకో, నా భాగ్యాన్ని నిర్మించేవాణ్ని నేనా, నువ్వా?)
టంగామనిషి పెదవి విరిచి ఊరుకున్నాడు. మే మా గల్లీలో ఆగాము. నే నాతనికి డబ్బిచ్చి దిగాను. బండిమనిషి బండితోలుకు వెళ్ళకుండా అక్కడే ఉన్నాడు. నేను దిగి ఇటూ అటూ చూస్తూ ఉన్నాను. వెంటనే ఎదురుగా ఉన్న మేడలోంచి నలుగురు ముసల్మాను భోగం పిల్లలు నన్ను చుట్టుముట్టారు.
ఒకతె: తు కిన్నా సోణా ఐ! అప్నేమకాందేవిచ్ ఆ సడ్డీకూవ్ సూరతీ వేక్. (ఎంత అందంగా వున్నావయ్యా నువ్వు, మా ఇంట్లోకి వచ్చి మా అందాన్ని చూడు.)