పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

తెనాలి రామకృష్ణకవి చరిత్రము


దను, చాలునా?' యనెను. రామకృష్ణుడు మిక్కిలి సంతసించి వెడలిపోయెను.

వారమురోజులు కడచెను. రామకృష్ణుడు తన బందుగుల జూచుటకయి కలుబరిగె నగరమునకు బోయెను. వెళ్ళిన నాలుగు రోజులకు ఆ బంధువునికడనుండి పెద్దన్న , పింగళిసూరన్న మున్నగు కవుల యింటికి రామకృష్ణుడు జ్వరపీడితుడై మరణించెనని లేఖలు వచ్చెను. నగరమంతయు క్షణములో నావార్త వ్యాపించెను. అట్టి హాస్యగాడు దొరకడని వర్తకులనిరి. 'మంచిస్నేహితుని, కవిని, గోల్పోయితి' నని రాయలు కన్నీ రువిడిచి వెంటనే అయిదువేల దీనారములను రామకృష్ణుని భార్యకంపెను. పదునైదు దినములు గడచెను. రామకృష్ణకవి కలబరిగె నగరమునుండి తిరిగివచ్చి, యాస్థానమునకు జనెను. రాయలు, తక్కుంగల వారు 'ఇదియేమిచిత్రము? నీవు మృతినొందితివని లేఖవచ్చెగదా?' యనిరి. రామకృష్ణుడు 'అవును, నేను మృతినొందినమాట వాస్తవమే కాని యమధర్మ రాజు 'ఇది యేమి! వీనికింకను గొంతకాలము గడువున్నదని 'ఓరీ! మీ రాయలవారు నీ భార్య కయిదువేల దీనారములంపినారు. ఆ ధనమును సుఖముగా ననుభవించిర 'మ్మనగా దిగిగివచ్చితిని' అనెను.

'ఆహా! అటులనా! ఈఅయిదువేల దీనారముల బొందుట కెత్తిన గొప్పయెత్తు'అని రాయలు మందహాస మొనరించెను.


29 మామిడి పండ్లు

రాయలతల్లి నాగాంబ మరణించుటకు బూర్వము రాయలను బిలిచి 'నాయనా! నాకు మామిడిపండ్లు తినవలయునని యున్నది.' అనెను. వెనువెంటనే రాయలు ఎంతఖరీదైనను సరే ఎచ్చటనున్నను సరే ఎన్నిదొరికిన నన్ని మామిడిపండ్లను గొనిరండు' అని భటులను నల్దెసలకంపెను. తిరిగి తిరిగి భటులు ఫలముల గొనివచ్చునంతలో నాగాంబ యసువుల బాసెను. తనతల్లి యవసానదశలో గోరినకోరిక