పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

తెనాలి రామకృష్ణకవి చరిత్రము


27 కుమ్మర మొల్ల

రాయలు విద్యానగర సామ్రాజ్యమును బరిపాలించుచున్న కాలమున నాత్కూరి మొల్లయను కుమ్మరస్త్రీ యుండెను, భర్త యామె బాల్యముననే మృతినొందినను, మారుమనుమున కిష్టము లేనిదై నాంధ్రమున బరిశ్రమ మొనరించి, కవిత్వముచెప్పుట నేర్చెను. శ్రీశైలశైవారాధ్యులవారికడ శుశ్రూష చేయుచు జాలకాలము గడపెను. శైవారాధ్యులవారికి సంతానము లేకుండుటచే దమ యవసానదశలో దమకున్న ధనమంతయు నిచ్చివైచిరి, ఆధనముతో నామె యుదరపోషణ మొనరించుకొనుచు, దన కవితాశక్తినంతయు వినియోగించి, రామాయణము వ్రాసెను.

ఆ రామాయణము నామె రాయల కంకిత మీయనెంచి, యాస్థానమున కరిగి చదువుట కనుమతి నీయగోరెదను. రాయలు వల్లెయనగా, రామకృష్ణకవి 'ఆడుదికూడ-నందులో గుమ్మరస్త్రీ కుండలు చేసికొనుటకు మాఱు రామాయణమే రచించుటయా'యని నిరసనభావముతో 'రాజేంద్రా! నేనొక పద్యము వ్రాసితిని. ముందు నాపద్యము నాకర్ణించి, తరువాత నాగ్రంథమును జిత్తగించుడు' అని ముందుగా 'వాల్మీకి దన బూతుపద్యము జదివెను. మొల్ల సిగ్గుపడి, యచటినుండి వెడలిపోయి తన గ్రంథమును శ్రీరామచంద్రునకే యంకిత మొసంగెను. ఆవృత్తాంతము నాలకించి, రాయ లామెను బిలిపించి మొల్లా! నీవు బహుజనశ్లాఘనీయమగు పనిజేసితివి. రామచంద్రున కంకితమిచ్చి, 'ధన్యవైతి'వని కొంతధనము నిచ్చి నీవు మా నగరమున నివసింపుము. ప్రతివత్సరమును నీయుదరపోషణకు వలయు ధనము మేమిచ్చుచుందు'మనెను,

ఆమె నిగర్వి. తనకు నౌకరులుండవలసిన బనిలేదని, స్వయముగా నంగడికిబోయి వలయు సంబారముల దానే కొని తెచ్చుకొను