పుట:Telugu merugulu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

57


“ఒకటి యడిగెదఁ గృప చిగురొత్తం జెప్పు
వలయు మీరు మాయింటికి వచ్చి యొక్క
ప్రక్క క్రిందుగ నిరువదియొక్క దినము
లనఘ! నిద్రించి తదిమొదలైన నీదు


చరితం బద్భుతము మునీ
శ్వర! దీనికిఁ గారణము విచారమున కగో
చర మెఱిఁగింపు మనుడు నా
ధరణీవల్లభునితో నతం డిట్లనియెన్":


'నీదు-చరితము' అన్న సమాసపదము రెండు భిన్నజాతి పద్యముల యంతాదులలో సున్నది. నన్నిచోడ మహాకవికూడ నిట్లోకచోఁ బ్రయోగించి నాఁడు,

"వ........ అనేక పురుషరత్నా కీర్ణంబై వెలుంగుచున్న -
సభలో - దానవదూత గాంచె విలసజ్జాజ్వల్యమానంబులై

(కుమార సం. 10, ఆశ్వా)</poem>


'వెలుంగుచున్న సభలో' అన్న సమాసపదము - సంహిత గలిగి యుండవలసినది. వచనావసానమునఁ గొంతగాను (వెలుంగుచున్న), ఉత్పలమాలాపద్యారంభమునఁ గొంతగాను (సభలో) విడఁబడియున్నది.


"రవిపదాహతిం జెడియుండు రాజువోలె
నని సరోజములొందఁ జక్రాహ్వయములఁ
జెట్ట లాడుటకని వికసిల్లుటకును
వెల్లనైనట్లు చుక్కలు వెలరువాఱె". (కుమా. గి ఆ)


దిద్దవలెను. అర్ధము కుదరక గ్రుడ్లుమిటకరించి కోట్టుకొని యెట్టకేల కిట్టు కవిపాఠము కనిపెట్టఁగలిగినాను.