52
తెలుఁగుమెఱుంగులు
శ్రీకృష్ణుఁడు రాయబారము వచ్చినపుడు విదురుఁడు ధృతరాష్ట్రునితో
సంభాషించు సందర్భములోని పద్యమిది. ఇచ్చట నీతలంపును నే నెఱుఁ
గుదును అను ముఖ్యార్ధమే కాక అది నీ తలలో పేనువంటిది సుమా అను
నర్ధాంతరముకూడ నున్నది. ఇక్కడఁ దిక్కన యెఱిఁగియే తల పేను
శబ్దచిత్రమును గూర్చినాఁడు, ఇటువంటి శబ్దార్థ చిత్రములను దిక్కన్న
రచనమున నెన్నింటినేని లెక్కింపవచ్చును. ఆమధ్య నెల్లూరు తిక్కన
వర్ధంతిసభలోఁ దిక్కన రచనావిశేషములనుగూర్చి చర్చ జరిగినట్లు
పత్రికలలోఁ జదివితిని. విరాట ద్వితీయాశ్వాసమున సైరంధ్రాని గూర్చి
కీచకుని ప్రలాపములలోఁ దిక్కన యు/అర్ధ దూషితముగా దీనిఁ బొందఁ
గాంచు తెలుఁగు నా కెయ్యది యొక్కో' అని కూర్చె ననియు నది కీచక
పాత్రోచిత మని యొకరును, దీనిఁ బొంద' యనుచో నశీలార్ధము
పరిగణింప నక్కరలే దని మణికొందఱు ననిరఁట! ఇప్పుడు ప్రచారములో
నున్న తిక్కన విరాటపర్వముద్రణము లాలేడింటలోఁ బార మిట్లే ముద్రితమై
యుండుటచే నీ యనర్థము వచ్చినది. తిక్కన రచన మిట్లుండదు. ఈ
పద్యము పై నాలుగు సీసచరణములందును దీనిజన్మంబున, దీనివల్లుఁడు.
దీని నామాకృతి, దీని వసించుట యని సైరంద్రీవాచక సర్వనామము
షష్ఠీసమాసగతమైయుండఁగూర్చి గీతలో మాత్రము దీనిఁబొంద' అని
వ్యస్తముగా, సపక్రమముగా, నశీలస్ఫోరకముగాఁ దిక్కన కూర్పుఁడు. కాన
ఇక్కడఁగూడ దీనిపొందుఁ గాంచు తెలుఁగు నా కెయ్యది యొక్కొ" అనియే
యుండవలెను. విరాటపర్వముద్రాపకు లెల్లరును “దీనిఁబొంద" యనియే
గ్రహించుట యనుశోచనీయము. తిక్కన “బొందను" ప్రయోగింపలేదు.
లేఖకులు, ముద్రాపకులు ప్రమాదపుబొందఁబడిరి. విరాటపర్వద్వితీ
యాశ్వాసము ననే తిక్కన కవితామర్మములును, బద లాలిత్యములును,