తెలుఁగుమెఱుంగులు
51
తెలుఁగుకూర్పుమటలుఁగు లెఱుఁగనివారైనచోఁ బ్రౌఢ సంస్కృత
పండితులు సైతము ఈ పద్యమున నలుఁ డేమిటి, గాలివాన యేమిటి
అనన్వితముగా నున్న వేయని యంగలారురు. తిక్కన యిక్కడఁ జతుష్పాత్తులని
కానీ, నాలుగుకాళ్ళ జంతువులని కాని సులువుగా ననలేఁడా? అనఁగలఁడు
కాని నలుఁడు, గాలివాన అన్న ప్రసిద్ధ పదముల ఝడితీస్ఫూర్తిగలిగి
పాఠకుల కన్వయము తోఁచి లోఁతైన యోచనతో తదాభాసచిత్రము
గోచరించునట్లు కవితోమర్మ మిక్కడఁ గల్పించినాఁడు.
సంస్కృత భాగవతమును బలుకూరులు పురాణము చెప్పిన యొక
బ్రౌఢసంస్కృతపండితుఁడు ఆంధ్రభాగవతముసుగూడఁ బురాణము
చెప్పుచు 'ఓదము త్రవ్వి జీవనపుటోలమునంబడి' అన్న పోతన్నపద్యమున
కర్ధము చెప్పుఁగుదరక “యిక్కడఁ బుటీల శబ్దమున కర్ధము తెలియలేదు.
సంస్కృతాంధ్ర నిఘంటువులలోఁ బటోలపద మున్నదికాని పుటోల పదము
లేదు. ఇందేదో తప్పున్నది” అని చెప్పెనంట! తెలుఁగు మఱుఁ
గులెటిఁగిన సహృదయుఁ డొకఁడు "మదపుటేనుఁగువంటి దీపదము.
మదము - ఏనుఁగు సమసించినట్లు జీవనము - ఓలము అను పదములు
సమసించినవి. ఓల మనఁగా నర్ధమిది" యని చెప్పి యా సంస్కృత
పండితునకు సహాయపడెనఁట! ఇది యెనుబది యేండ్ల క్రిందట నిజముగా
జరిగినకథ! మా నాయనగారు చెప్పఁగా విన్నాను.
“నీతలపేసు గంటి నొకనేర్పున శౌరికి లంచమిచ్చి సం
ప్రీతుని జేసి కార్యగతి భేదము సేయఁగఁ జూచె,దింత బే
లైతిగదే సుమేరుసదృశార్ధముఁ జూచియు బార్ఖుఁ బాయునే
యాతఁడు క్రీడిభక్తియును నచ్యుతు పెంపును నీ వెఱుంగవే?"