44
తెలుగుఱుంగులు
“అనుపమ కార్ముకాది వివిధాయుధ విద్యలయందుఁ గోవిదుం
డసఁగ సజయ్యుండై పరగు నర్జునుఁ బోలఁగ నన్యు లెందు లే
రను జనఘోష ముచ్చరితమయ్యె మరుచ్చలితోచ్చవీచి ని
స్వనముఖరాబ్ధివేష్టితవిశాలమహీవలయాంతరంబునన్. "
"అతులవిభూతితో మణిమయాభరణద్యుతు లొప్పఁగా శత
క్రతుఁడు శచీసమేతుఁడయి కాంచనచారువిమానమాలికా
గతదివిజోత్తముల్ గొలువఁగా కొలువుండు వరాప్సరోఽజింగనా
యతవిలసత్కటాక్షకు సుమార్చీతసుందరవక్త్రచంద్రుఁడై. "
రసము, భావము, రీతి అనునవి మూఁడును ముప్పిరి గొని,
జిగిబిగులతో ముచ్చట్లుగొల్పు పద్యములు ఇవి మూఁడును చూఁడుడు:
"ప్రకటితకోపవేగమునఁ బద్మదళాయతనేత్రముల్ భయా
నకతరలీలఁ దాల్చె నరుణద్యుతి నుద్యతమై త్రిశాఖమై
భ్రుకుటి లలాటదేశమునఁ బొల్చెం ద్రీకూటతట త్రిమార్గగా
సుకృతిఁ బ్రభంజనప్రియ తనూజున కంతకమూర్తి కచ్చటన్, "
"ధారుణి రాజ్యసంపద మదంబునఁ గోమలిఁ గృష్ణఁ జూచి రం
భోరు నిజోరుదేశమున నుండఁగఁబిల్చిన యిద్దురాత్ముడు
స్వారమదీయ బాహుపరివర్తితచండగదాభిఘాతభ
గ్నోరుతరోరుఁ జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్"
“పిలువంగఁబడక సభలకు,
బలిమిం జని పలుకు పాపభాగుల లోకం
బులకు జనవేడి పలికెదు;
పలువా! యెఱుఁగవు పరాత్మపరిమాణంబుల్."