పుట:Telugu merugulu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

43


నన్నయ భారత భాష నాగమసూత్ర స్మృతి భాషనుగా భావించుచోఁ దిక్కనభాషను గాళిదాసకావ్యభాషనుగాఁ బరిగణింపవచ్చును. నన్నయ దొక ఋషిమార్గము. తిక్కన దొక రసమార్గము.


“విలువిద్య నొరులు నీక
గలముగ లేకుండ నిన్నుఁ గజపుదు నని మున్
జలికితిరి నాక కాదీ
త్రిలోకముల కధికుఁ జూచితిమీ యొకయెఱుకన్".


ఈ పద్యమున నాల్గవచరణము తొల్త జగణపు టుయ్యాల యూపులో తర్వాతికవు లనేకులు హాయిగా ఊగ సాగినారు. ఈ యూపులో పింగళి సూరన్న ఎట్లూఁగినాఁడో గుర్తింపుఁడు,


“ఆపు డించుక తడ వన్య
న్యపాణి సంస్పర్శ సంభృతానంద స్తం
భపరీతాత్మత నుండిరి.
ప్రపంచమంతయును మఱచి పయున్ సతీయున్".


శ్రీనాథ పెద్దనాది కవీశ్వరులు చంపకోత్సలాది పద్యములలో మూఁడు నాల్గు చరణముల నొక సంస్కృత సమాసపు జాడింపున జాడించి హాయిహాయి యనిపింతురు. ఈ హృద్యపద్యవిద్యకు నన్నయ ఆద్యగురువు,


 “ఆలయక ధర్మశాస్త్రములయందుఁ బురాణములందుఁ జెప్పు సు
త్పలదళనేత్ర విందుమ యుపత్యము మే లని కావునన్ యశో
నిలయులఁ బుత్రులం బడయు నీ కొనరించెద సంగతాంగుళీ
దళవిలసన్మదీయకరతామరసద్వయయోజితాంజలిన్". >