పుట:Telugu merugulu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగుమెఱుంగులు

31


నాటకములు. పాటకచ్చేరీలు, బోగమాటలును, సాగుచుండెడివి. వచ్చిన పండితు లందఱును కోటలోని ఆటలు, పాటలు, నాటకములు చూడబోవుచుండెడివారు. మా గురువులు శ్రీ చెళ్లపిళ్లశాస్త్రులుగారు కోట వెలుపల మాలదాసర్ల వీథినాటకములు చూడఁబోవువారు. రాత్రి ఆ మాస్వాదించిన రసానుభవమును మర్నాఁడు పునశ్చరణ చేయుచు ఆనందీచుచు మాకు వినిపించి మమ్ము ఆనందింపఁ జేసెడివారు. వారు గుర్తించి చెప్పినప్పుడే వానిరుచి ననేకులు గ్రహింపఁగలిగెడివారు. వా రీమధ్య పత్రికలలో లోకాభిరామాయణములను మంచివాడుకపలుకుబళ్లతో ముంచెత్తినారు.

ఆంధ్రభాషలో ఆదికాలమునాఁటి కావ్యరచన ముడిసరకుభాషతో, దేశీచ్ఛందోరచనతో ప్రజాసామాన్యమునకు సులభముగా ఉండెడి దనియు, అదియే ఇప్పటి పాటలు పదాల వాడుక భాష అనియు నా నమ్మకము. నన్నయభట్టారకునికి పూర్వము శాసనములలో సీసగీతమధ్యాక్కఱలు పద్యములు కనఁబడుచున్నవి. వానిలో మధ్యాక్కఱను నన్నయాదులయిన ఆదికాలపు ప్రౌఢకవులు కొందటే కొంచెముగా పాటించినారు. ఆదికాలపు మధ్యాక్కఱ ఒకటి ఉదాహరించుచున్నాను.

"స్వస్తి సృపాంకుశాత్యంతవత్సల సత్యత్రినేత్
విస్తర శ్రీ యుద్ధమల్లుఁ డనవద్య విఖ్యాత కీర్తి
ప్రస్తుత రాజాశ్రయుండు త్రిభువనాభరణుండు సకల
వస్తుసమేతుండు రాజసల్కిభూవల్లభుం డర్ధి".


ఇందులో కొన్ని యక్షరములను జేర్చినను తీసివేసినను పద్యము పద్యముగానే ఉండునట్లు రచన ఉన్నది. పఠన ఫణితి తాలగతి కలదిగా గోచరించుట లేదు. సంగీత రుచి గుర్తించిన తెలుఁగుకవులు ఈ పద్యమును