పుట:Telugu merugulu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుఁగులు

143


వేమారెడ్డిగారి ప్రేరణమున నాతఁడు రామాయణము నా నీలకంఠేశ్వరస్వామి కంకితముగా రచించెనేమో! ఈ పద్యము గుడ్లూరి నీలకంఠస్వామి స్తుతి సందర్భములోనిది గోవచ్చును.!

ఆ పద్యములలో ఎర్రాప్రెగ్గడ రచనాగౌరవము కానవచ్చుచున్నదా యని సందేహము తోచును. పద్యము లన్నియు సలక్షణములై యున్నవి. గొప్ప రచనా ప్రౌఢిమ కానరాకున్న దనవచ్చును కాని యర్రా ప్రెగ్గడ తొలుతటి కూర్పుకాన యిందు రచనమునఁ గొంత వెన్పాటు గల దేమో!

5.

శ్రీనాథుఁడు 'పరిఢవింతుఁ బ్రబంధపరమేశ్వరునిదేవ సూక్తి వైచిత్రి నొక్కాక్కమాటు' అని తనయెర్రా ప్రెగ్గడరచనానుకరణాభిమాసముసు వెల్లడించుకొన్నాఁడు. ఈ క్రింది పద్యద్వయమున ఎర్రా ప్రెగ్గడ సూక్తి వైచిత్రియు, శ్రీనాథుని తదనుకరణమును గాననగును;


"ఉ.కందక గాజువాలక మొగంబు వికాసమునొందెఁ జేతు లీ
యందములైన కాళ్ళు నరుణాంబురుహంబులలీలఁ గాంతఁ జె
 న్నాందెడు, జీవహీను లీటు లుండరు ప్రాణముతోడనున్న వా
డిందుసహోదరుఁడు ధరణీశ్వర నీకు విషాద మేటికిన్?"

ఉ."కందక గాజువాఱుక వికాసము ఉందక మందహాసని
ష్యందము చెక్కుటద్దముల నాటక నెమ్మది నిద్ర వోవున
బందమునొందె ధాత్రి సిరియాలకుమారకువ్య చంద్రుఁ దా
నందము నొందె నప్పు డెలనాఁగమనంబును భర్తచిత్తమున్. "

(శ్రీనాథుని హరవిలాసము)

ఎర్రాప్రగడ 'సూక్తివైచిత్రి' శ్రీనాథుని సమకాలపుఁ బ్రసిద్ధకవీ జక్కనకూడ

“ఈత్రయిఁ దాఁ బ్రబంధపరమేశ్వరుఁడై విరచించె శబ్దవైచిత్రి
నరణ్యపర్వమున శేషము......... "

అని ప్రశంసించెను.