తెలుంగుమెఱుంగులు
125
'
హత్తుకొని యొక్క కొందు
సత్తెదువుం గట్టఁ బనిచి యందజకీయం దోఁ
దిలీ యొకటి గాని త్రేణి మ
కుత్తర ముత్తరమటంచు నొకప్రొద్దుకడన్."
శ్రీ వేంకటరాయశాస్త్రుల వారీ పాఠమునే గ్రహించిరి. మఱియు
వ్యాఖ్యలో నిట్లు వ్రాసిరి:
“తేండి" దొరికిన వ్రాతప్రతు లన్నింటను 'త్రేణి'అని యున్నది. 'శ్రేణి' అని 'తెండి' ( శయనించి) అనుటకు ఈ ప్రాంత పుస్తకములలో తఱచుగఁగలదు. 'తేఁడు' ధాతువు “తెండు ధాతువునకు రూపాంతరముగా శ.ర.లో నున్నది. కొన్ని దేశ్యశబ్దములందు తొలియక్కరమునందలి క్రారవడులు అంతరించుట ప్రసిద్ధమే. డ కారము తావున ణకారము నిలుచుటయు సిద్ధమే. ఉ. అణఁగు-అడఁగు, పోణిమి-పోండిమి ఇత్యాదులు. కావున నిట కవి ప్రయోగించిన పదము 'శ్రేణి' అని యుండు సని యూహింపఁబడినది. ఆ ప్రాంతపుస్తకములలో టీకయుఁగలదు. అందు "శ్రేణిమటి' 'నిద్రమేల్కాంచీ' అని అర్ధమును వ్రాయఁబడినది". 'తేఁడు'కు 'వెదకు' అర్థమును నిరాక్షేపముగా నిరూపించు ప్రయోగ మీధి యొకటి గలదు;
"జూదంబుఁ బన్నిదంబును
వాదునుఁ బతితోడఁవేఁడ వలవదు కడుఁబో
రా దయ్యెనేని భృత్యులు
భేదము గాకుండు గెలువు పెనుపఁగవలయున్,"
(భోజరాజీయము)
ఆముక్తమాల్యదపీఠిక 51 - వ పుటలో శ్రీవేదము వేంకటరాయ
శాస్త్రులవా రీప్రయోగమును గూడఁ జూపి యిట్లు వ్రాసిరి. * తేఁడు అనఁగా
వెదకుట అని యరవమునఁ బ్రసిద్ధము. ఆ యర్థమున శ.ర. లేదు. "