పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంగీతసాగరం విజయనగరం


విజయనగర చక్రవర్తుల కాలంలో నాట్యకళతో పాటు, సంగీత విద్యకూడ ఎంతో అభివృద్ధి పొందింది. హరిహర బుక్కరాయలకు గురువైన విద్యారణ్యస్వామి 'సంగీతసార'మనే ఒకసంగీత ఉద్గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథంలో 267 భాగాలను గురించి విపులంగా వ్రాయబడిందట.

అలాగే ప్రౌఢదేవ రాయల కొలువులో వున్న కల్లనాథుడు శార్ ఙ్గదేవుని 'సంగీత రత్నాకర'మనే గ్రంథానికి వ్యాఖ్య వ్రాశాడు.

రెండవ రాయల కాలంలో, ముల్‌బాగల్ మండలేశ్వరుడైన సాళువ గోపతిప్ప సంగీత, నాట్య, తాళ, అలంకార శాస్త్ర గ్రంథాలు వ్రాసినట్లు తెలుస్తూవుంది. వామనుని కావ్యాలంకార గ్రంథానికి 'కామధేను' అనే వ్యాఖ్యానాన్ని రచించాడు. 'తాళదీపిక' అనే గ్రంథాన్నీ సంతరించాడు.

కవిరాట్టే కాదు, సంగీత సామ్రాట్టు క్కూడా:

శ్రీకృష్ణదేవరాయలు సంగీత విద్యలో కూడ ప్రజ్ఞావంతుడు. రామరాయల వలేనే కృష్ణ దేవరాయలు కూడా శ్రావ్యంగా పాడగల్గిన నేర్పరి. కృష్ణదేవరాయలు గాన కళలో ప్రజ్ఞాధురీణుడని కృష్ణాపుర శాసనంలో ఉదహరింపబడింది.

కృష్ణ దేవరాయలు బాల్యంలోనే కృష్ణుడనే ఓ సంగీత శాస్త్రకారుని వద్ద సంగీతాన్ని సాంప్రదాయకంగా అభ్యసించినట్లూ, ఆయనకు మడులు, మాన్యాలు, వజ్రహారాలు బహూకరించినట్లూ కన్నడ గ్రంథమైన రాఘవేంద్ర విజయం తెలుపుతూ వుంది.

కట్టుదిట్టమైన కర్ణాటక సంగీతం:

విజయనగర చక్రవర్తుల కాలంలో సంగీతం శాస్త్రయుక్తంగా అభివృద్ధి పొందినది. ఈ విధంగా కర్నాటక ప్రాంతంలో కట్టుదిట్టంగా సంగీతం అభివృద్ధి