పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/731

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
సుద్దాల హనుమంతు విజయ గీతం:

సుద్దాల హనుమంతు ఈ దండాగానాన్ని దీర్థంగా నాటి పరిస్థితులను వివరిస్తూ విజయ గీతం వ్రాశాడు. ఆ గీతంలోని ముఖ్య విషయాలను ఇక్కడ వివరిస్తున్నాను.

ఓ భారతీయులార మీరు బాగ వినరండీ
భారత కాంగ్రెసు రామరాజ్య మిదండీ
నేవాలుగాను వ్రాసితి నొక పూట వినండీ

అంటూ చెప్పే విషయాలు అపార్థం చేసుకోరనీ, నిజాన్ని తెలుసుకోమని, వేష భాషలను చూచి మోస పోవద్దనీ, ప్రజా ప్రభుత్వం వస్తుందనీ, కలలు గన్న ప్రజలు కడగండ్లు చూడండంటూ.

పందొమ్మిది వందల నలుబది ఏడాగష్టు నా
ప్రజలెల్లరూ ద్వేషించేటి బ్రిటిషు పాలనా
కోటాను కోట్లు ప్రజలు తిరుగుబాటు కతనా
ఖ్యాతిగను రాజ్య మప్పగించిపోయిరిగానా


అంటూ పరాయి పాలన పోయి కాంగ్రెసు ప్రభుత్వం వచ్చిందనీ, ప్రజలందరూ సంతోషించారనీ, ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి గనుల సంపదను వెలికి తీసి ప్రజలందరికీ తిండీ బట్టా, వుండటానికి ఇల్లూ, దున్నటానికి భూమి, ప్రజలందరికి సకల సౌకర్యాలు చేకూరతాయని ఆశించారు. అంటూ

అధికారములో కొచ్చిన నెహ్రూ ప్రభుత్వమూ
విధి తప్పి నడవ సాగెనూ దినదిన ప్రమాణమూ
ఐదేళ్ళు గదువవచ్చెను ప్రతి అంశములోనూ
బీదల హక్కుల నన్నిటి బూడిదలో త్రొక్కెనూ

అంటూ నెహ్రూ ప్రభుత్వమూ, ఆ ప్రభుత్వ తాబేదారులూ ప్రజల ఆశలను అడియాసలు చేశారంటూ.

దిన దినం ప్రజల జీవిత మతిభారమయింది
ధనవంతుల భూస్వాముల దోపిడి పెరిగింది
అసాధ్యమైన నిరుద్యోకత అధిక మయ్యింది.