పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/551

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాయకానే జూతు పాలేటి త్రోవ
కట్ట మీదంగళ్ళు గంగ రేగుల్లు
ఘనమైన గుడి వాడు గంగ పుట్టిల్లు.

ఇలా సాగుతుంది పాట. మనుమసిద్ధి రాజుకో, నల్లసిద్ధి రాజుకో, వారి రాజ్యంలో కాటమరాజు అవుల మందల్ని మేపుకున్నందుకు పుల్లరి

ఇవ్వక పోవటం వల్ల చెలరేగిన వివాదం యుద్ధంగా మారింది. ఆ యుద్ధంలో అటు రాజులూ, ఇటు యాదవ సామంతరాజులూ పాల్గొని ఎందరో వీర మరణం చెందారు. వారి యొక్క కథలు 32 వెలువడ్డాయి. వాటి సారాంశమే ఈ చారిత్ర. అయితే కాటమరాజుకీ, నెల్లూరు మనుమసిద్ధికీ యుద్దం జరిగినట్లు ముప్పై రెందు కథలలోనూ ఏ ఒక్క కథలోనూ మనుమసిద్ధి ప్రసక్తి లేదు.

అయితే కాటమరాజుతో పోరిన రాజు నల్లసిద్ధి రాజు అతని తమ్ములు, పాపసిద్ధి, ఎఱ్ఱసిద్ధి,కొండికసిద్ధి, కొమరసిద్ధి మొదలైన రాజులని వీర గాథలలో వుంది. కాటమరాజుతో పోరాడింది మనుమసిద్ధితోనో నల్లసిద్ధితోనో అనే విషయం చారిత్రికులు నిర్ణయించాలి.

పొడపోతుల వారు:

విశాఖపట్టణ ప్రాంతంలో యాదవులకు గురువులుగా చెప్పబడే ఒక ప్రత్యేకమైన తెగ వుంది. వీరిని పొడపోతులవారు అని పిలుస్తారు. వీరు కొమ్ములవారి వంటి వారేమో తెలియదు. కాని యాదవ కులానికి చెందిన వారు మాత్రం కారు, యాజకులు గాను, గురువులు గాను

వున్న వీరిని యాదవులు ఎక్కువగా గౌరవిస్తారు. ఈ పొడపోతులవారు, యాదవులకు గోత్రాలు చెప్పి, కాటమరాజు కథల్ని పాడతారు. ఈ పొడపోతుల వారు తూర్పు గోదావరి మండలంలో వున్నారు.