పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/529

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1862 ప్రాంతంలో పూరి రామ చంద్ర రాజు కుశలాయక పదాన్ని రచించాడు.

అలాగే 1874 ప్రాంతంలో పూరి నారాయణ రాజు ధర్మాంగద చరిత్రను రచించాడు. 1922 లో మంధా సుబ్బరాయ శాస్రి 'పాతాళ హోమం' అనే పదాన్ని 1925 లో పొడుగు రామ బ్రహ్మ కవి "గయోపాఖ్యానం" "వైకుంఠ మహాత్యం" రచించాడు.

అయ్యగారి కూర్మనాథం 20 వ శతాబ్దంలో విరాట పర్వాన్ని పదంగా రచించాడు.

ఇలా పైడిగొండ అప్పన్న "సుభద్రా కళ్యాణం" చంద్రగిరి తాతయ్య "ఉత్తర గోగ్రహణం" ముడుంబ లక్ష్మణాచార్యులు "శ్రీ రామ కథను" 1895 లో రచించాడు. చిత్రాడ కామేశంసోంపుర వాసి - త్రినాథుని చరిత్ర - నడిమింటి రామ యోగి 1864 లో "బాణాసుర యుద్ధం" కటోజు వీరాచారి "భల్లాణ రాయపదం" చెర్విరాల బాగయ్య గారి పదం "కొమిరెల్లి మల్లకథ" వున్నాయి. ఈ విధంగా అనేక హరిహరీ పదాలున్నాయి.

పైన ఉదహరించిన హరిహరీ పదాల రచనలన్నీ, మన జానపద

కళారూపాలైన హరి కథలలోనూ, యక్షగానాలలోనూ, వీధి నాటకాలలోనూ, బుర్ర కథలలోనూ ఉదహరింపబడే వున్నాయి. అందువల్లనే మన జానపదులకు పూర్వ పురాణ గాథలన్నీ తేటతెల్లంగా తెలిసి పోయాయి.