పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/401

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిందులు తొక్కే చిందు భాగవతం


తెలుగు జాతికి గర్వ కారణమైన అన్య ప్రాంతీయులకు కూడ ఆదర్శ ప్రాయమైన, శాస్త్రీయ, సంప్రదాయ... జాన పద నృత్య రీతులను రూపొందించి ప్రచారంలోకి తీసుక వచ్చారు ప్రాచీనాంధ్ర నృత్య శాస్త్ర వేత్తలు.

పూర్వం తెలుగు నాడును ...యక్షభూమి అని పిలిచే వారు. యక్షులనే గంధర్వ జాతికి చెందిన వారు, ఆడి పాడిన, భూమి కనుక వారి నృత్య శైలియే యక్షగానంగా వర్థిల్లిందంటారు. యక్షగానం అతి ప్రాచీనమైనది. పల్లె ప్రజలకు అందుబాటులో వున్న రమణీయ కళారూపాన్ని అనుసరించి నృత్య కేళిక చేయువారే చిందు వారు.

ఈ నృత్యం సుమారు రెండు వేల సంవత్సరాల నాటి దంటారు. నాటి నుంచి నేటి దాకా ఒక ప్రత్యేకతను సంతరించుకుని పండితుల్నీ, పామరుల్నీ తమ కళా నైపుణ్యంతో ఈ కళాకారులు మెప్పించి శభాష్ అనిపించుకున్నారు. కాని ఈ కళాకారులు ఆశించేది పట్టెడు అన్నం, పాత వస్త్రాలు మాత్రమే. వృత్తుల ననుసరించి, జాతులు ఏర్పడినట్లే, ఆజాతులపై ఆధార పడి వారికి వినోదాన్ని చేకూరుస్తూ జీవించే మరికొన్ని __తెగలు ఏర్పడ్డాయి.

చిందు మాదిగలు:

మన దేశంలో అతి బీదవారిగా, అందరి కంటే ఆఖరి జాతి వారుగా చూడబడే హరిజనులకు చెందిన... మాదిగ ...వారిపై ఆధారపడి జీవించే కళాకారులు