పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/363

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురంలో మంటలు లేస్తాయి. అందులో చిక్కిం దనుకున్న సాగరికను రాజు మంటల్లోకి దూకి వెలికి తీస్తాడు. రాజుకూ సాగరికకూ సమాగమం జరుగుతుంది.

చివరికి రాజు విదూషకునితో అంటాడు ఇది స్వప్నమా? ఇంద్రజాలమా అని, అప్పుడు విదూషకుడు ఇలా అంటాడు. గారడీ వాడు పోతూ పోతూ అన్న మాటలను జ్ఞాపకం చేసి ఇది వాడి పనే అంటాడు.

ఇలా గారడీ వాళ్ళు వీథుల్లో ఎవేవో చెప్పి, వివిధ ప్రక్రియల్ని చూపించటం మనం మనం చూస్తూనే వున్నాం. వినోదిస్తున్నాం., అయితే కొన్ని శతాబ్దాల క్రిందే, శ్రీ హర్షుడు ఇంద్రజాలాన్ని తన నాటకంలో ప్రవేశపెట్టాడు.

దీనిని బట్టి నేటి మన జానపద కళారూపాలకు ఎంతటి ప్రాచీన చరిత్ర వుందో, ఆనాటి ప్రజలు వాటిని ఎలా ఆదరించారో పై వుదాహరణలే తార్కాణం.