పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిట్టిపంతులు: అయ్యా చిట్టం. ఇంతగా బహువచనంగా సెలవిస్తున్నందున, మాకు తెలవలేదండీ.
ఇలా దాష్టీకం పంతులు తన గొప్ప తనాన్ని చాటుకుంటూ వుంటాడు. అయితే ఎవరూ లెక్కచేయరు. ఉదాహరణకు __ అవునోయ్ పంతులూ, యీ పిల్లలంతా ఏమిటోయి?
చిట్టి: భాగవతం ఆడుతున్నారండీ
దాష్టీ: అవునోయి పంతులు ఎవరాడిస్తే ఆడుతున్నారు.
చిట్టి: మహారాజరాజేశ్వరులు, లక్ష్మీ పుత్రులు.
దాష్టీ: ఎందు నిమిత్త మాడుతున్నారు.
చిట్టి: ఉదర నిమిత్తం బహుకృత వేషం_ అవునోయి మేము అధికారులము నువ్వు ముందు నడుస్తావటోయి.
చిట్టి:చిత్తం మహాప్రభో, వాళ్లను వెనుక నడిపిస్తాను లెండి.
దాష్టీ:అవునోయ్ చిట్టీ, నాకు నుయ్యి అయినదీ తెలియదు, గొయ్యి అయినదీ తెలియదు. ఈ గోతిలో పడమన్నావటోయ్.
చిట్టి: ముందు నడిస్తే ముందు నడుస్తారా అంటిరి. వెనుక నడిస్తే ఇలా అంటున్నారు. ఎలా అయ్యా__

ఇలా సంవాదం జరుగుతూ వుండగా భోగంవాళ్ళు వస్తారు.
చిట్టి: అయ్యా భోగంవారు వచ్చారు. వారికి బస ఎక్కడ కుదర లేదు.
పంతులు: మన దేవతార్చన గదిలో దించు.
చిట్టి: చిత్తం, అయ్యా. అక్కడ దేముడున్నాడండీ.
పంతు: దేముణ్ణి తీసి ముసలమ్మ కొట్లో పడవెయ్యవోయ్.
చిట్టి : ముసలమ్మగారున్నారండి
పంతు: ముసలమ్మను తీసి గుఱ్ఱాల సావిట్లో పడవెయ్యి.

ఇంతలో: బట్రాజులు వస్తారు.

భట్రాజులు: చిత్తం, అయ్యా, మోదుకూరు భట్టు మూర్తులం. మీ సందర్శనానికి వచ్చాం.
పంతు: అవునోయ్ పంతులు, మీ సందర్శనానికి వచ్చా మంటున్నారు. అది మానేసి, గడ్డం దర్శనం చేసు కోమనవోయ్ __

ఇలా భట్రాజులకూ, దాష్టీకం పంతులుకూ మధ్య ఇలా సంభాషణ జరుగుతుంది. అంతా లోకంలో జరిగే విశేషాలన్నిటిని చర్చిస్తారు. ప్రశ్న సమాధానాలతో,