పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
యక్షగాన రచనా పసందు:

పూర్వ కవుల కవితా వైభవమంతా వారి రచనలలో పొందు పరిచారు. ప్రతి కార్యాన్నీ శుభముహూర్తంతో ప్రారంభించినట్లే, ప్రతి రచనా ప్రారంభం దైవప్రార్థనతో ప్రారంభించే వారు. అదే విధానాన్ని యక్షగానాల్లో అవలంబించారు. అది భారతీయ సంప్రదాయం.

యక్షగాన రచనలో భగవత్ ప్రార్థన తరువాత ఏ విఘ్నాలు కలుగకుండా, విఘ్నేశ్వర ప్రార్థన, షష్ఠ్యంతాలు తరువాత యక్షగానం పేరు, గ్రంథకర్త పేరు, తరువాత కథా ప్రారంబం. ఈ ప్రారంభానికి ఎవరో ఒకరుండాలి. అయితే మార్గ నాటకాలలో మాదిరి సూత్ర ధారుని ప్రవేశం యక్షగానంలో లేదు.

ఆడుతూ పాడుతూ కథ వినిపించే నటియే ఈ పూర్వరంగం ప్రయోగించేదని తెలుస్తూ వుంది. మధ్య మధ్య కథాసంధి అని పలికి ఉదాహరణకు "భయపడుతున్న సుగ్రీవుని తో హనుమంతు డేమనుచున్నాడు" అని కథా సంధి జరిపేవారు.

చివరకు ఏలలు, ధవళాలు, యాలలు, హారతులు గద్యలో తిరిగి కృతిభర్త, కృతి కర్త పేరు, కవిత్వం చిన్న చిన్న మాటలతో సులభశైలిలో వుంటుంది. శృంగార, వీర, కరుణ ప్రధాన రసాలు. గరుడాచల యక్షగానంలో శృంగారానికి ప్రాధాన్యమిస్తే, సుగ్రీవ విజయంలో విప్రలంభ కరుణ రసాలకు ప్రాధాన్యం. డొంక తిరుగుడు లేని కథతో సాఫీగా నడిచిపోతుంది. కథాశిల్పం పరవళ్ళు తొక్కుతుంది. వీటిలో ఒక్కొక్క పాత్రనూ ఒక్కొక్క వ్వక్తి ధరించే ఆచారం లేదు. నర్తకి మాత్రమే ఆడుతూ పాడుతూ వినిపిస్తుంది.

యక్షగాన సుందర ప్రదర్శనం:

పూర్వం యక్షగానాలను వ్రాయించీ, ఆదరించీ, ప్రదర్శిప జేసింది చాల వరకు ప్రభువులే. ఆ తరువాతే అవి ప్రజల మధ్య ధారావాహికంగా ప్రదర్శింప