పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

జానపదకళారూపాలు


కపికులాధీశు వక్షము గాడియున్న
విపుల సాయకము బల్విడి పెల్లగింప


వాలి యూర్థ్వలోకానికి పోయెను. కపులప్పుడు సుగ్రీవునకు కనక కుంభముల నభిషేకము జేసి</poem>

అర్థచంద్రికలు ఫాలమున
బంగారు పట్టమును గట్టి
అరుదండ రత్న సింహాసనము మీదన్
పుణ్యాంగనలు ధవళములు పాడిరత.

ఎటువలెను.

శ్రీరాముడు గుణధాముడు వారిజలోచనుడు
శూరత రావణు గూలిచి నారీ మణి దేవలయున్
రాముని గృప కపిరాజ్యము క్షేమంబున బాలించే
శ్రీమంతుడు సుగ్రీవుడు భూమండలి బొగడొందున్

అపుడు సుగ్రీవుడు శ్రీరామునకు కానుకలు తీసుకొని వచ్చెను. ఆ గిరి ప్రాంతాలలో ఉండే చెంచీతలు ఈ విధంగా ఏలలు పాడిరి.

భాను వంశమున బుట్టి
దానవ కామిని గొట్టి
మౌనివరుల సన్నుతించగా ఓ రామ చంద్రా!
పూని మఖము నిర్వహింపవా
రాని నాతి జేసివురా
రాతి చేతి విల్లు విరిచి
భూతలేంద్రు లెల్ల మెచ్చగా! ఓ రామ చంద్రా
సీతను వివాహమాడవా?

పైన ఉదహరింపబడ్డ గ్రంథ బాగములను బట్టి చూస్తే సుగ్రీవ విజయమనే యక్షగానము ఎంత రసవత్తర మైనదో బోధపడుతుందంటున్నారు చింతా దీక్షితులు గారు వారి ప్రజావాఙ్మయంలో.