పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షయంగా వెలుగొందిన యక్షహానం

125


ఒక మాట నాతోడ నొనరంగ దెల్పవై
తట రావణుని దున్మి యా సీతదేనె॥

తార దుఃఖం:

వాలి మూర్ఛనొందిన సంగతి తారకి తెలిసింది. దుర్భర దుఃఖంతో ఆమె వారి వద్దకు వచ్చి విలపించింది. సుగ్రీవుని దూరింది. శ్రీరాముణ్ణి చూచి ఈ విధంగా దెప్పి పొడుస్తూంది.

ఆలి చెరగొని పోయినట్టి దశాశ్యుడుండగ నిర్నమిత్తము
వాలి నేటికి జంపితివి రఘువంశ తిలకా
న్యామమేటికి దప్పితివి నర నాథ జానకీ తోడనే చెర
బోయెనేని రాజనీతియు భూరిమహిమల్.

తేరుకున్న వాలి:

మూర్ఛనుంచి తేరుకున్న వాలి అంగదుణ్ణి ఓదార్చి రామునితో ఈ విధంగా అంటున్నాడు:

ఓ మహాత్మ| దయాపయోనిధీ!రామ
భూమితలేశ నాపుణ్యమెట్టిదియొ
నీచేత మృతినొంద నేడు తుర్యాశ్ర
మాచార పరులకు నందగారాది
వైకుంఠ పదవి నిర్వక్రంబుగాక
గైకొంటి నా పాతకము లెల్ల బాసె
భాను వంశాధీశ భవనాశ రామ
ప్రాణముల్ నిర్వహింపవు మేన నింక
బాణంబు దీయవే పార్థివోత్తంస

అనగా రాముడు చేరవచ్చి__

"........నిజ భుజాఖదుర్వార
త్రైలోక్యారక్షణ ధర్మ ప్రశస్తి
నెలమి పెంపగు నట్టి నిజ హస్తమునను