పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

జానపదకళారూపాలు


సుగ్రీవుడు హనుమంతుని పంపి భయంతో మలయాద్రి పోయాడు. హనుమంతుడు రామ లక్ష్మణుల సంగతి పూర్తిగా తెలిసి వచ్చి సుగ్రీవునితో వివరాలు చెప్పాడు.

......... ఓ కుపికులాధీశ
ఆ రూఢి నీ కనాయాసంబు కతన
శ్రీరాము డనెడి నిక్షేపంబు దొరకె
నింక నీ యక్కరలెల్లను దీరె
గొంకక రఘురాము కొల్వు కేతెంచి.

దుఃఖిస్తున్న రాముడు:

త్రిపుట

నన్ను విడిచియు నిలువజాలక
నాతి వచ్చితి వడవి దిరుగను
నిన్న విడెచేనెట్టులోర్తును
నీలవేణీ
రమణిరో నిను బాసినప్పుడె
రాతిరే శివరాతి రాయెను
నిమిషమైనను నాదు కంటికి
నిదుర రాక॥

అంటూ విలపిస్తాడు. తరువాత శ్రీరాముడు సుగ్రీవునితో స్నేహం చేసి వాలిని బాణంతో కొట్టాడు. అప్పుడు వాలి శ్రీరామునితో ఇలా అంటున్నాడు:

వాలి విలాపం:

నను బేరుకొని పిలిచి నాముఖాముఖి నిలిచి
జననాథ పోరాడి జంపరే ప్రీతి
పొంచి వేసితి రామ భూపాల! నృపధర్మ
మెంచికోతేవైతి వెంతజేసితివి
శ్రీరామ నీరామ జెరగొన్న రావణుని
వారిధుల ముంచితిని వాలమున జుట్టి