పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

జానపదకళారూపాలు


సుగ్రీవ విజయం:

కందుకూరి రుద్రయ్య సుగ్రీవ విజయాన్ని యక్షగానంగా వ్రాసి ఆ వూరి జనార్థన దేవునికి అంకిత మిచ్చాడు. సుగ్రీవ విజయం అతి ప్రాచీనమైనది గాను, ప్రాముఖ్య మైనది గాను గుర్తించబడింది. రుద్రయ్య సుగ్రీవ విజయాన్ని యక్షగాన మనే పేర్కొన్నాడు. ఇందులో విశిష్టమైన రగడ భేదాలే గాక, సంవాదనలతోనూ, దరువులతోనూ, సంభాషణలతోనూ, ప్రియదర్శనయోగ్యంగా, వీథినాటకంగా ఆడబడి వుండవచ్చని నేలటూరి వారు వివరించారు.

16వ శతాబ్దపు ప్రాంతపువాడైన చిత్రపౌరి రాఘవాచార్యుని 'విప్రనారాయణ చరిత్ర' 'బాలపాపాంబ అక్కమహాదేవి చరిత్రా' రచనా విధానం కూడ సుగ్రీవ విజయం కోవకే చెందివున్నాయి.

కర్నూలు జిల్లా వాసిమైన పింగళి సూరన ప్రభావతీ ప్రద్యుమ్నంలోనూ, గంగావతరణం నాటకం లోనూ ఆనాటి ప్రదర్శనా పద్ధతిని గూర్చి వివరించాడు.

అహోబిల ప్రాంతంలో గుశదుర్తి ఆగ్రహార వాస్తవ్యుడు కాజవేంకటాద్రి 'వాసంతికా పరిణయం' అనే యక్షగాన ప్రబంధాన్ని వ్రాశాడు.

ఆరోజుల్లోనే నెల్లూరు ప్రాంతంలో కంకంటి పాపారాజు విష్ణుమాయా విలాస మనే యక్షగానంలో అనేక విశేషాలను వివరించాడు.

పేలపురం చేరువలో వున్న వుద్దండమల్ల సముద్రవాసియైన ఎల్లకవి శేషము వెంకటపతి శశాంక విజయాన్ని అనుసరించి 'చంద్ర తారావిలాస' మనే యక్ష గానాన్ని రచించాడు.

ఇప్పటికి షుమారు రెండు వందలఏబై సంవత్సరాల క్రితం సేలం జిల్లా హోసూరు తాలూకా తోగీరయ అనే అగ్రహార నివాసి అన్నదానం వెంకటాంబ రామయణం బాలకాండను యక్షగానంగా రచించింది.

రాయలసీమలో జక్కుల వారి కులదేవతైన అక్కదేవతల కొండ వుండడాన్ని బట్టి యక్షగానానికిది మూలమని చెప్పవచ్చు. ఈ నాటికీ గుంటూరు గోదావరి