పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

జానపదకళారూపాలు


తంజావూరు నాయకరాజులకు మంత్రిగా వున్న గోవిందదీక్షితుడు, 'సంగీత సుధ' అనే ఒక శాస్త్ర గ్రంధాన్ని రచించాడు. ఈ గ్రంథాన్ని రఘునాథ రాయలు రచించినట్లు కూడ చెప్పుకుంటారు. రఘునాథరాయలు నృత్యంలోనూ, గానంలోనూ ఆరితేరిన కళాకారుడు. ఈయన 'రఘునాథమేళ' అనే ఒక క్రొత్త వీణనే సృష్టించాడని ప్రతీతి.

కళల మధురిమను కాపాడిన మధుర నాయకరాజులు:

అలాగే మధుర ఆంధ్ర నాయకులు కూడ లలిత కళాసంపదలో విజయనగరం, తంజావూరులతో సరిసమానంగా తులతూగుతూ వుండేవారు. వీరి రాజ్యంలో సంగీత నృత్యాలు దేవదాసీలు చేస్తూ వుండేవారు. దేవాలయాలలోనూ, పండిత సభలలోనూ, ఆస్థానలోను, వీరి గాన కచేరీలు జరుగుతూ వుండేవి. పండిత సన్మానాలతో పాటు దేవదాసీలకు కూడ ఇతోధిక పారితోషికాలు, సన్మానాలు జరుగుతూ వుండేవి.

విజయరంగ చొక్కనాథుని కాలంలో తిరువేంగడాచార్యుడనే గొప్ప గాయకుడుండే వాడట. క్షేత్రయ్యా, త్యాగరాజూ ఈ కాలంలోనే వర్థిల్లి మధుర మైన పద వాఙ్మయాన్నీ, గేయ వాఙ్మయాన్ని రచించాడు.