పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
తందాన కథలు:

ఇంటిని తిమ్మ రాజు కత ఇంటిని ఈర్ల కథాప్రసంగముల్
ఇంటిని పాదు లాలి,
ఇబమింటిని నాయకురాలి శౌర్రెమె
ప్పంటికి నంది వాక్యముల పొందు
చెర్రితల నాదు భాగ్యమెన్నంటికి గల్గనోయును నవజ్ఞుడు
మూర్ఖుడు చంద్రశేఖర.

భాగోతులు:

రాతిరి సూస్తి యేసములు రమ్మెముగా గురులాన మొన్న బా
గోతుల సత్తెబామ యన గూడని తాపములెల్లసేసె మా
పాతకురాలు రాద వల వచ్చము రుక్మిణి సుద్దికిష్టమం
టీ తీరుగ నంచు వచియించును మూర్ఖుడు చంద్రశేఖరా.

పంబలవారు, జాతర్లు:

ఇరిదిగసూస్తిరీరతము లెన్నెనో యావనగొండ గంగ జా
తర సరిరావు పంబులును తప్పెటలున్ కొముగాండ్ల సిండ్లసం
బర మదిదెల్పు మింకొక పబాచము రంకులరాటమెక్కి నే
తిరిగిన సాటిరాదని నుతించును మూర్ఖుడు చంద్రశేఖరా.

ఈ విధంగా 1336 లో ప్రారంభమైన విజయనగర సామ్రాజ్యం మూడు వందల సంవత్సరాల పాటు నిలబడి, నశించింది. దక్షిణ హిందూ దేశమంతా రెండు వందల సంవత్సరాలు వీరు పాలించారు. ముఖ్యంగా ఆంధ్రదేశంలో విజయనగర రాజ్య కాలం ఒక విధంగా స్వర్ణయుగం.