పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేపాక్షి అనే చోట పెనుగొండ విరూపణ్ణ అనే రాయల వారి ఉద్యోగీ, అతని సోదరుడైన వీరణ్ణ నాయకుడూ లేపాక్షి నగర నిర్మాణానికి కారకులని తెలుస్తూ వుంది.

విరూపణ్ణ లేపాక్షిలో కట్టించిన వీరభద్రేశ్వరాలయంలో ఒక నాట్య మంటపం వుంది. అందులో శివుని నటరాజమూర్తిని, గాయక బృందంతో పాటు అప్సరసలను ప్రదర్శించే శిల్పఫలకాలున్నాయి. ఈ దేవాలయంలో అపూర్వమైన నాట్య విజ్ఞానం వెల్లి విరుస్తూ వుంది; నృత్యం చేస్తున్న నాట్య కత్తెలతోను, మార్దంగిక వాద్య కారులతోను దేవ గాయక బృందాలతోనూ శిల్ప కళామయమైన స్తంభాలు నిలబడి ఈ నాటికీ మనకు దర్శనమిస్తున్నాయి.


సృష్టికర్తమైన బ్రహ్మదేవుడు మృదంగ వాయిద్యం వాయిస్తున్నట్లూ, నందికేశ్వరుడు హుడుక్క వాయిద్యాన్ని ప్రయోగిస్తున్నట్టూ, తుంబురుడు వీణా తంత్రుల్ని మీటుతున్నట్లూ, దేవనర్తకి యైన రంభ నృత్యం చేస్తున్నట్లూ మన చూడగలం.

నాటి జానపద కళల తియ్యందనాలు:

చంద్రశేఖర శతకాన్ని వ్రాసిన చంద్రశేఖరుడు తాను వ్రాసిన శతకంలో తాను చూసిన ఆనాటి జానపద కళారూపాలను ఎన్నింటినో వర్ణించాడు. ఈతడు వాడిన భాషను బట్టి ఇతడు నెల్లూరు ప్రాంతం వాడు కావచ్చని ప్రతాపరెడ్డి గారు తమ సాంఘిక చరిత్రలో వుదాహరించారు. చంద్రశేఖరుడు 17 వ శతాబ్దం వాడని వూహించ వచ్చు. అంటే విజయనగర సామరాజ్యం దాదాపు అంతరించిన కాలం. ఆ నాటి ఆచార వ్వవహారాలను వెక్కిరించి తన రచన ద్వారా హేళన చేశాడు. ఈయన తందాన కథలను గూర్చి, జంగం కథలను గూర్చి, భాగవతులను గూర్చి, పంబలవారిని గూర్చి చమత్కార మైన భాషలో వుదాహరించాడు. భోగం ఆటలను గూర్చి ఈ విధంగా వర్ణించాడు.

భోగం మేళం:

సేరువ వాడపల్లి నరిసిమ్ముడి తీరతమోయి బోగమ
 మ్మోరులయాట సూస్తి దనిముంగల దేముడెంత, ఇద్దెలో
తీరు, పయాస గంటి, వొకతిత్తి గుకిన్కిక కూడెవాని కా
లూరికె మొక్క బుద్దెగు నహోయను మూర్ఖుడు చంద్రశేఖరా.

.