పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయనగర చక్రవర్తుల పాలనలో రాజ్యం చేస్తూ వుండేవాడు. ఆయన ప్రజలను నానా చిత్రహింసలకు గురిచేస్తూ దుర్భరంగా పరిపాలిస్తున్నాడు. సకాలానికి ఎవరైతే శిస్తు చెల్లించరో వారి స్త్రీలను బలవంతంగా కోటకు తీసుకవచ్చి ఆ స్త్రీల స్తనాలను చిరుతలు పట్టించి వారివద్ద శిస్తుల్ని వసూలు చేసే వాడట. కూచిపూడి కళాకారులు దేశాటనం చేస్తూ గురవరాజు రాజ్యం నుంచే ప్రయాణిస్తూ ఆయన యెక్క హింసా కాండను కళ్ళార చూచి, ఆ దృశ్యాన్నంతనీ కథారూపంలో పెట్టి ప్రదర్శనాలిచ్చుకుంటూ విజయనగర వీరనరసింహ రాయల ఆస్థానానికి చేరుకున్నారు.

కేళికలతోనే కావ రందించిన కూచి పూడి కళాకారులు:

కూచిపూడి కళాకారులు రాయల వారిని కేళిక అడిగారు. ఆనాటికే కూచిపూడి విద్వాంసుల యెక్క కళా విశిష్టతల్ని విన్న అరాయల వారు ప్రదర్శనానికి సెలవిచ్చారు. ప్రదర్శన ప్రారంభమైంది. ప్రదర్శనంలో మన కళాకారులు గురవరాసు ప్రభుత్వ పాలనా విధానాన్నే ప్రదర్శించడం మొదలు పెట్టారు.

ప్రథమంగా గురవరాజు వేష ధారణతో ఒక నటుడు ప్రవేశమై, రాయల సమక్షంలో స్త్రీల స్తనాలకు చిరుతలు పట్టించి తహశ్మీలు సొమ్ము ఇవ్వవలసిందని హింసపెట్టాడు.

రాయలవారు గురవరాజు పరిపాలనా విశేషాలను తెలుసుకున్నారు. ఆ రాత్రి ప్రదర్శన పూర్తి అయీ అవగానే దర్బారు ఏర్పాటు చేసి సైన్యాన్ని తరలించి గురవరాజు పరిపాలనను అంత మొందించే, ఈ విషయాన్ని ప్రదర్శన రూపంలో చిత్రించి కనువిప్పు కలిగించిన కళాకారులను వేనోళ్ళ పొగిడి కానుకలిచ్చి, అగ్ర హారలిచ్చి పంపారు. వారి సంస్థానంలో కళాకారులను పోషించారు.

శిల్ప కళతో పాటు చేయి చేయిగా చిత్రకళ - సకల కళా సమంవితం - విరూపణ్ణ లేపాక్షీ:

ఆ కాలంలో శిల్పకళతో పాటు చిత్రకళ కూడ అభివృద్ధి చెందింది. విజయనగర చక్రవర్తి యైన అచ్యుత రాయల కాలంలో హిందూపురానికి 9 మైళ్ళ దూరంలో