పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ విధంగా ఆనాటి కురవంజి లోను, యక్షగానంలోనూ, ఈ ఎరుకలసాని ప్రాముఖ్యం ఎంతగానో వుండేది.

యక్షులైన వారే జక్కులవారు:

విజయనగర చక్రవర్తుల కాలంలో ఇతర కళారూపాలతో పాటు వర్థిల్లిన కళారూపం యక్షగానం. మన ప్రాచీన కళారూపాల్లో అతి ప్రాచీనమయినది యక్షగానం. ఇది ఆంధ్ర, కర్ణాటక, తమిళ రాజ్యాలలో అతి విస్తారంగా వ్వాప్తిలోకి వచ్చింది. ఒకనాడు యక్ష గాన వాజ్మయం దక్షిణ భారతదేశమంతటా దేదీప్య మానంగా వెలుగొందింది.

16వ శతాబ్దంలో యక్షగాన చరిత్రలో ఓ నూతన శకం ప్రారంభమైంది. సుప్రసిద్ధులైన కవి గాయకులనేకులు యక్షగానాల్ని రచించారు. రారాజులు వారికి వుత్సాహాన్నిచ్చి వారిని పోషించారు. 1506 మొదలు 1509 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీ కృష్ణదేవరాయల అన్నగారు వీర నరసింహ రాయలు యక్షగాన రచయితలను, ప్రదర్శకులను చాల గౌరవించేవాడట. క్రీ.శ, 1514 లో కర్నూలు జిల్లా చెరువు బెళగల్లు గ్రామంలో తాయికొండ నాటక ప్రదర్శనాన్నిచ్చిన చేగయ్య కుమారుడు నట్టువ నాగయ్యకును, పాత్రిగ నటించిన పోతవర గ్రామ వాస్తవ్యుడు నట్టువ తిమ్మయ్య కుమార్తెకును ఆ వూరి కరణం తిరువత్తూరు సోమరను కుమారడున బసవరసు కొంత భూమిని దానమిచ్చినట్లు తెలుస్తూంది. తాయికొండ నాటక ప్రదర్శనాన్నిచ్చిన వారు ఆనాటి కర్నూలు జిల్లా వారేనని భారతిలో నేలటూరి వెంకట రమణయ్యగారు వుదాహరించారు.

స్థనాలకు పన్ను విధించిన సంబెట గురవరాజు:

కూచిపూడి భాగవతులను గురించి, వారి పూర్వ చరిత్రను గురించి మాచుపల్లి కైఫీయత్తులో 1502 నాటికే సవిస్తరంగా వ్రాయబడి వుంది. ఆ రోజుల్లో సంబెట గురవ రాజనే సామంత రాజు