పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాళ్ళని భోగం మేళమని పిలుస్తూ వున్నారు. ప్రతి మేళానికి ఆటలోనూ, పాటలోను, అభినయంలోనూ, అనుభవంలోను ఆరితేరిన ఒక వృద్ధవేశ్యమాత పెద్దగా వుంటూ మేళాన్ని సక్రమ పద్ధతుల్లో నిర్వహించి, నాయకత్వం వహించి మిగతా వేశ్యలైన నాట్య సుందరీమణులను కలిసి కట్టుగా నడిపేది. అందులో వెనుక పాట పాడేవారు కొందరు ఆ పాటకు అభినయం చేస్తూ ప్రేక్షకుల ముందుకు వెళ్ళి నాట్యం చేసే వారు.

కృష్ణదేవరాయల కాలంలో దేవదాసీలు ప్రముఖ స్థానాన్ని అలంకరించారు. నాట్య కళయందు ప్రజ్ఞానిథులుగా వెలుగొందారు. రాయల దర్బారులోను, రాణివాసపు మందిరాలలోను, దేవస్థానలలోను, వీథి మంటపాలలోను, ఎటుచూసినా దేవదాసీ సుందరాంగనలు నాట్య, నాటక, గాన మాధుర్యాలను వెదజల్లారు.

అగ్రస్థానం వహించిన అద్వితీయ తారలు:

భోగంవారని పిలువబడే ఈ దేవదాసీలు రాయల సామ్రాజ్యంలో మహోన్నత మైన స్థానాన్ని సంపాదించుకున్నారు. దేవదాసీలకు అన్ని సమయాల్లోనూ, రాయల అంత:పుర సౌధాలలోనికి ప్రవేశముండేది. కొంత మంది వేశ్యలు రాణుల వద్ద దాసీలుగాను వుండేవారు. వసంతోత్సవాలలో - ఎటు చూచినా దేవదాసీలు వసంతాలను వెదజల్లేవాట.

ఆనాడు ఆస్థాన శిల్పులు దేవాలయాలమీదా, వారి మహాసౌధాలమీదా, కుడ్యాలమీదా, స్థంభాలమీదా ఆ దేవదాసీల నాట్య భంగిమాలను, వివిధ అభినయాలనూ వేషభూషణ అలంకారలతో సహా చిత్రించారు. కొన్ని చిత్రాలు నగ్నంగా కూడ చెక్కబడి వున్నాయి. హంపీ హజారా రాజాలాయం ముఖ ద్వారం వద్దనూ, ఆలయం లోనూ, స్తంభాలపైనా నాట్యకత్తెల యొక్క ఇటువంటి చిత్రాలు మనకు కనబడుతున్నాయి. ఈ విధంగా దేవదాసీ నాట్యకళను రాయలు ఎంతగానో ఆదరించాడు.

దేవతా సన్నిధిలో దివ్యప్రదర్శనం:

ఆనాటి భోగం పడుచులు తొలిసారి దేవతా సన్నిధిలో నాట్యంచేసి తరువాత నాట్యాన్ని వృత్తిగా స్వీకరించే వారు. రాజులు భోగం వారి సంగీనృత్యాలను మెచ్చు