పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రంజకం శ్రీరంగ రాజు, రంగరాజు కుమార్తె రంజకం కుప్పాయి, నట్టువ నాగయ్య మొదలైన వారు నృత్య, నాటకాలను ప్రదర్శించేవారట.

దశరా వేడుకల్లో జెట్టీలు కుస్తీలను ప్రదర్శించే వారట. రాత్రిపూట బాణాసంచాలను కాలుస్తూ వుండేవారట. నానా విగ్రహాల ఆకారంలో వున్న బాణాసంచాలు పట పట మంటూ ఆకాశాని కెగిరి పగులుతూ వుండేవట.

రాయల కాలంలో ఒక్కొక్క ఋతువులొ ఒక్కొక్క రాగానికి ప్రాముఖ్యముండేదట. వసంత కాలంలో హిందోళరాగం పాడినట్లు ఆముక్త మాల్యదలో వుదహరింప బడి వుంది.

తిరుపతి వచ్చిన దివ్యతారలు:

అచ్యుత రాయల పరిపాలనలో నృత్యకళ ఆభివృద్ధి పొందింది. ఆయన అస్తానంలో అనేక మంది నర్తకీమణులు పోషింప బడ్డారు. ఆనాడు అనేక నర్తకీమణులు తిరుపతి దేవస్థానానికి పంపబడినట్లు దేవస్థానంవారు ప్రకటించిన ఒక శాసనాన్ని బట్టి తెలుస్తూవుంది.

ఆరోజుల్లో పురుషులే స్త్రీ వేషాలు ధరించే వారనీ, నాట్యపు పోటీలు జరిగేవనీ, నిపుణులు ఉత్తమ మధ్యమాది నృత్య నిర్ణయాలను చేసినట్లూ, మృదంగం, దండెతాళం, బురుమకిన్నెర, సన్నగాళే వీణ, ముఖవీణ, వాగ్రోలుడోలు, మౌరి, భేరి, గౌరు, గుమ్మెట, తమ్మెటం, దుక్కి, డక్కి, చక్కి, చయ్యంకి, మొదలైన వాయిద్యాలుండేవనీ ఆముక్తమాల్యదలో వుదహరింపబడింది.

పెద్దన మనుచరిత్ర నాలుగ ఆశ్వాసంలో స్వారోచిపుర ప్రవేశ సందర్భాన "చిలకలకొల్కి కల్కి యొక చేడియ నాటక శాల మేడపై నిలువున నాడుచుండి" రని ఒక పద్యంలోనాటకశాలను పేర్కొన్నాడు.

భోగంపడుచుల రంరరంగ వైభోగాలు:

ఆనాడు ఆటపాటలకు భోగంవారే ప్రధానంగా వుపయోగ పడేవారు. భోగం వారి సమ్మేళనాన్ని మేళమనే పిలుస్తూ వుండేవారు. ఈ నాటికీ అనుగాతంశృ భోగం