పుట:TeluguSasanalu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గణ్డత్రిణేత్ర వైదుంబ మహారాజు వన్దాడి శాసనము

43

రాచమర్యాదలతో కాల్చిరి అని యర్థము.'పురిపు'అనుచోట అక్షరములు సందిగ్ధ ముగ నున్నవి.'చితి' యను అర్థము గల పదమగుననిపించుచున్నది. తరువాత వాక్యములో,కీఱుగుంట సొచ్చిన కణ్ణనూడ్ల(డ-θ)వంశము వారికి వైదుంబ మహారాజులు వనంబున ఉందురు.అనగా కృతజ్ఞలుగా నుందురు. ఈ మాన్యమును చెడగొట్టువారు వారణాసిలో బ్రాహ్మణుని,గోవులను చంపినవారు.గట్టులితమ్ అనితుది లో వ్రాసినవాని పేరేమో స్పష్టముగ లేదు. ఇట్టిదే మఱియొక శాసనము అచటనే కలదు.

*