ఈ పుట ఆమోదించబడ్డది
9. కొండపఱ్తి శాసనము.
వరంగల్లు సమీపములో కొండపఱ్తి యను గ్రామమువద్ద చెఱువులో నొకకొండరాతిపైన ఈ శాసనము కలదు.ఇది ఇటీవలనే కనుగొబబడెను.అక్షరములు సుమారు తొమ్మిద వ శతాబ్దమునకు చెందునని భావింపబడుచున్నవి.అర్థమగుటలో నిదియు కొంత చిక్కు కలిగించుచున్నది.ఇది యొక పొలమును కట్టుబడి కిచ్చు సందర్ంహమును తెలుపును.
- స్వస్తి[|]పొలమెయరట్టోడి మంచికాళు
- కొణ్డపకు సమభగంబు తంబుల స్రవంబు చేసిన
- భూమి[|*]దీని గూన్తుకున్తుల పరుదివడ్డి యారంభఛేయువారు[|*]
- యిట్లు దక్కనిగల్పమణ్డి తంబులంబు దిన్నవారవన్దామి గొరవలు[దా]నమెయు
- కుమరమయ్యయు గణపతి యోజు యిట్లు సాక్షిగాను తంబు[ల]స్రవంబు చేసిన స్రవణభూమి[|*]
- యీ నెల యరి నాలుగు ద్రమ్ములు ఆయంబు పుట్టెణ్డుగొలుగు ధనంజెయ ఫలధారు
- కొనువారు ఆకిడి ప[ం]గులేదు[|*]యుద్దఱు బొత్తున నార[ం]భ చేయువారు అమ్మ೯ కొణ్డమణ్డీ యారంభ
- చేయువాణ్డు స్రావకుల భీమియక్ఱొం పాలదివాకరయస్రన్నుగొల మేడియము సాక్షి{|*]
- నాగ కమరియ క్రొచ్చె{||*]మంగళ మహాశ్రీ[||*]
'క్ఱొంపాల'పదములో(8వపంక్తి)'ఱ'అక్షరము వాడబడెను.సున్నకు బదులింక బిందువులేగలవు.తంబుల స్రవంబుచేసిన భూమి-ఉదకధారా పూర్వకము చేసి దాన ము లొసగుట మనకు తెలుసు.ఇది తాంబూలము పుచ్చుకొని యిచ్చినభూమి. ఇది దానముకాదు.ఒక కట్టడి.అంటే భూమి సేద్యము