పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

318

తాలాంకనందినీపరిణయము


మ.

అమరద్వేషి యొకండు ద్రోణుని కృపాచార్యు న్విలోకించి హీ
నమతిం బెండ్లి గనుంగొనందలఁచి యానందంబున న్వచ్చి క
ష్టరములం బొంది కులాభిమానములు నాశంబొంద హైడింబుచే
సమయం దుస్సమయంబు చేకూఱెగదా సౌజన్యులౌ మీ కిఁటన్.

274


చ.

ముదిమికి ముప్పువచ్చె పెనుమూర్ఖు సుయోధనుమైత్రి నెమ్మది
న్వదలక పొట్టకూటికిని వానికడ న్వసియించు టింక మీ
కిది తగదంచు బల్కి యొకయిఱ్ఱి కళాసము ఫెళ్ళుఫెళ్ళునన్
విదిలిచి పెంటపై బఱచి వేవసియింపుఁ డటంచు బల్కియున్.

275


చ.

ఒకయెడ డాగియుండిన సుయోధనసూనుని బట్టి తెచ్చి యో
వికలితచిత్త పెండ్లిగొనువేడుక వచ్చినవాఁడ వీగతిన్
మొకమిటు నేలవై చికొని మూల్గెదు నీ కడుపాఱ కూటికిం
బొకబొక బొక్కునీకు పువుఁబోణుల సౌఖ్యము తక్కువాయెనే!

276


చ.

ప్రియమున గోరి తెచ్చుకొను పెండ్లికుమారుఁడ వేమొ నీ వనా
శ్రయగతి నిట్లు దుఃఖవివశంబున బ్రేలుటకంటె చచ్చుటే
నయమని తోచెడిం బ్రతికి నల్గురిలో తలనెత్తి యేగతిం
బ్రియమతిఁ జూడనోపెదవు పెండ్లి పెటాకులు జేసి లక్ష్మణా.

277


క.

ఈపగిది విలయకాలవి
రూపాక్షునివలె ననేకరూపముల మహా
టోపమును జూప బలుఁడు భ
యాపాదితుఁ డగుచు హరిగృహంబున కరిగెన్.

278


మ.

చని నిశ్చేష్టితుఁడై నిలంబడిన యాసంకర్షణుం జూచి చ
య్యన దామోదరుఁ డంజలీకరతలుండై స్వామి విచ్చేయు కా
రణ మేమంచు వచింపగాఁ విగతసంరంభంబునం గద్గద
ధ్వని నిట్టూర్పులు బుచ్చుచుం బలికె చింతాక్రాంతచేతోగతిన్.

279


ఉ.

కూఁతురు మాయమయ్యె జనఘోష దిగంతము నిండె వజ్రని
ర్ఘాతశిలాతిపాతముల కౌరవసైన్యము మ్రొగ్గి మగ్గె నీ