పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

319


రాతిరి తెల్లవారుట దురత్యజమై మదిఁ దోఁచె దీని నే
రీతి శమింపజేసేదొ హరీ! నీవుగాక మఱెవ్వ రీధరన్.

280


చ.

చెలిమిని మున్ను దాస్యములు చేకొనలేదె ఫణీశ్వరాకృతిం
గలిగిన నాతొ రెండవయుగంబున శ్రీరఘురామమూర్తివై
యలరి సహోదరప్రియము లన్ని విధింపవె నేఁటి కగ్రజా
ఖ్య లభితమయ్యెనంచు భవదాజ్ఞ మరల్ప స్వతంత్రమున్నదే!

281


చ.

అవని నశక్తునిం భుజబలాధికు జేయఁగ దోర్బలాఢ్యు ని
ర్జరవగతుఁగా నొనర్ప నతిజాడ్యుని పూజ్యుని జేయ బూజ్యునిం
భవమతిగా నొనర్పఁగ భవన్మహిమ ల్గణుతింప నీరజో
ద్భవభవశక్రముఖ్యుల కభావ్యము గాదె సరోజలోచనా!

282


క.

ఇది యేమొ తెల్పినానని
మది సంశయమిడక మత్కుమారీమణి నిం
పొదవ నగుపఱుచి యీదు
ర్మదదనుజాటోప మణఁచి మనుప దలఁపవే!

283


మ.

అనుచుం దీనముఖాబ్జుఁడై పలుకు తాలాంకు న్విలోకించి యి
ట్లనియెన్ స్వామిటులాడనేల భవదీయాజ్ఞం దలందాల్చి తో
చినరీతి న్వినిపింతు దేవర లుపేక్షింపంగ నూహింప కి
ట్లనుకూలించితిరేని సర్వజనతాహ్లాదంబు బ్రాపింపదే.

284


మ.

మొదల న్నేవినిపించు నీతములనేమో చిత్తమం దన్యథా
స్పదమై తోఁచి కురుక్షితీశ్వరుని సంపన్మోహివై సత్మళా
భ్యుదయుం డయ్యభిమన్యుఁ డెవ్వడని కోపోద్వృత్తిచే సోదరి
న్విదళింపం జెడుబుద్ధి నీకొదవె భావిశ్రీయశోహానికిన్.

285


ఉ.

దానికి పార్థనందనుఁడు దల్లిని దోడ్కొని బోవ కానన
స్థానమునం ఘటోత్కచుఁడుఁ దారసిలం భవదుల్లసోక్తుల