పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

317


సహితముగ రాజవరులను చక్కడంచి
దనుజభటు లిట్లు బీభత్స మొనర జేసి.

269


చ.

పురమున దైత్యకింకరులు బోరున జొచ్చి శుభాలయంబునం
బరగు సమస్తవస్తువులు బల్మి పయోనిధి బాఱవైచి యు
ద్ధురగతి పౌరులం దఱిమి దోర్బలదుర్జయులై గదాహతిం
దురగరథేభసైన్యముల ద్రుంచి చికా కొనరించి రెంతయున్.

270


సీ.

ఒకచోట సైంధవుసిక చేనొడిసిపట్టి
        లోపోటులను గ్రుద్ది యేపుమాపె
నొకచోట సౌబలుముఖము క్రిందుగ దీసి
        కొప్పుబ ట్టీడ్చి చీకొట్టి విడిచె
నొకచోట భూరిశ్రవుకరమ్ములు బిగబట్టి
        బడద్రోసి చెంపలు బగలవైచె
నొకచోట బాహ్లీకు కుత్తుకబట్టి గెట్టించి
        మెదలనీకుండ మేన్ జిదిమి మెదిపె


గీ.

నొక్కచోటను గురుసూను నొడిసిపట్టి
కదలనీకను ఱాళ్ళ మోకాళ్ళ బొడిచె
నొక్కయెడ కర్ణుకర్ణంబు లూత జేసి
మెడలపైకి ధువాళించి మేను జించె.

271


చ.

మును ద్రుపదాత్మజన్ నృపసమూహము జూడఁగ మానభంగ మీ
వొనఱుచు పాపజాతి విదిగో ప్రతికారము ప్రాణభంగ మే
నొనరుతు నంచు దైత్యభటుఁ డొక్కరుఁ డుగ్రత దుస్ససేనుతో
బెనఁగుచు ప్రాణ ముడ్డుకొన భీకరముష్టి నడంచె ఱొమ్మునన్.

272


చ.

బలువున మాయజూదమని బన్ని యుధిష్ఠిరు సర్వసంపదల్
గెలిచి కురుక్షితీశునకు కేవల మాప్తతఁ బెండ్లిపెద్దవై
నిలిచితివే యటంచు శకునిం గని యొక్కసురారికింకరుం
డలఘుతరాశనీతులితమౌ కరముష్టి నడంచె నుగ్రుఁడై.

273