పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

310

తాలాంకనందినీపరిణయము


బొదవింప న్సమకట్టెఁ దత్ప్రతికృతం బూహింపఁగా బుద్ధిదో
చ దటంచుం దిగులొంది శ్రీహరినివాసం బార్తుఁడై చేరియున్.

228


క.

పెదవులు దడపుచు నాగఁటి
గుదెరోకలికోల గోడకు న్వైచి భయం
బొదవ మధుసూదనుని క
ట్టెదుట నిలిచి గాద్గదోక్తి నిట్లని బలికెన్.

229


శా.

శ్రీకృష్ణా యిది యేమొ వింత జనియించెం గాక యీరాత్రి చీ
కాకై లోకులకూత లార్భటులు భూకంపంబుగాఁ దోచె ని
శ్శ్రీకంబై శశిరేఖ గేహమున వీక్షింపగ లేదయ్యె నేఁ
డీకృత్యం బతిఘోరకర్ముఁ డెవఁడో హీనుం డొనర్పందగున్.

230


క.

మొదటన్ లక్ష్మణుఁ డార్తిని
బెదఱుచు మొలచీర సడలి భీమార్భటిఁ బె
ల్లదిఱి చనునపుడె పెండిలి
తుదిముట్ట దటంచు నాకు దోఁచె నిజముగాన్.

231


మ.

పులులున్ సింహములున్ వృకంబులు మహాభూతంబులు న్నల్గడల్
గలయం బర్వగ భూపతు ల్గజతురంగశ్రేణితో వానితో
జలపోర న్సమకట్టి దోర్బలవినిస్సారాంగులై మ్రగ్గి రే
వలన న్నిల్వ వశంబు లే దిఁకను దైవప్రేరితం బెట్టిదో!

232


క.

పెండ్లిం జూడఁగ వచ్చిన
వాండ్లెల్ల మహాశనీనిపాతంబులచే
పండ్లీలగఱచి కొందఱు
గుండ్లపయిం దొఱఁగి నేలఁ గూలి రనేకుల్.

233


చ.

విరిగె రథవ్రజం బఖిలవీరభటావలి గూలె భీకర
ద్విరదము లొక్కట న్మడిసె తీవ్రహయంబులు డుల్లె రాజశే