పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

311


ఖరులు వధూజనంబులు చికాకున దిగ్వసనాంగులై వడిం
బఱచిరి భూమి నెత్తురులు బాఱెఁ బ్రహహము లౌచు నెల్లెడన్.

274


క.

చీఁకటులు గవిసె మింట న
నేకబలాహకనికాయ మెఁసగి రుధిరధా
రాకలిత మగుచు పిడుగుల
మూఁకలు లోకులు చికాకు మూకొనదాకెన్.

275


క.

ఏ నంతట కయ్యంబున
కై నేగి నభంబు జూడ నతిరౌద్రతర
ధ్వానములు జేయుచుం బ్రళ
యానలకణగణము రాల్ప నవశం బయ్యెన్.

276


క.

కౌరవరాజు వినిర్గత
శూరుండై మేను నొచ్చి శుద్ధాంతమునం
జేరి తడఁబడుచు నున్నాఁ
డారయ తలవంపులయ్యె నచ్యుత నాకున్.

277


మ.

ఇక నేమంచు వచింప క్రూరదనుజుం డెవ్వండొ మాయాబలా
హకపంక్తిం దగ చాటు చేసికొని హాహాకారరోషోగ్రుఁడై
యొకచో గంతులు వేయు నొక్కయెడ నత్యుత్సాహుఁడై గేరు వే
రొకమూలం దిరుగున్ హసించు నొకచో నొక్కొక్కచో నేడుచున్.

278


క.

ఉఱుములు మెఱుపులు పటుభీ
కరగండశిలాశనీనికాయంబు మహో
ద్ధురగతిని బఱప నిల్వఁగ
వెఱ చిట జనుదెంచితిన్ భవిష్యతి దెలియన్.

279


ఉ.

నీ వఖిలార్థవేద్యుఁడవు నేతవు దాతవు నన్ను భ్రాతగా
భావమునం దలంచుట ప్రపంచవిలోకవిడంబనార్థమే