పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

309


ట్లెదిరింప న్వశమౌ బటానబయలం దెబ్భంగి జీవింప దో
చదు మున్నెప్పటితావు కేగుట విశేషం బంచు దోచె న్మదిన్.

222


ఉ.

నావిని కర్ణశల్యకురునాథు లధైర్యమనీషులై భయం
బావహిలన్ హలాయుధు శుభాలయము న్వెసజొచ్చి కంపితాం
గావయవంబులం జెమట లాముకోనం గళనీతజీవులై
లావు దొలంగి యొక్కెడ నిలంబడుట ల్గని సీరపాణియున్.

223


మ.

శశిరేఖామణి మాయమౌట విషదుర్జంతువ్రజంబు ల్సహ
స్రశతంబుల్ జనియించుటల్ కురుకులక్ష్మానాథసైన్యంబు దు
ర్దశలం జెంచుట లక్ష్మణుండు భయదాక్రందధ్వనిం బాఱుటల్
కుశిగుంపు ల్గొని యాదవు ల్పురజనుల్ ఘోషించుట ల్గాంచియున్.

224


చ.

హలముసలంబుల న్నిజభుజార్గళపీఠి నమర్చియు న్మహో
జ్జ్వలవిలయాంతకాకృతి నవారితభీషణరోషదీప్తుఁడై
బలువిడి శోణనాంగణ మభంగురలీల వినిర్గమించి ది
క్కులు బఱికించి దివ్యభిముఖుం డగుచున్ ముసలంబు ద్రిప్పినన్.

225


క.

అప్పుడు దనుజుం డార్చుచు
తెప్పలుగా పులులు ఫణులు తేళ్లును డాలున్
నిప్పుల కుప్పలు గుప్పున
గుప్పెం బలభద్రుఁ డుడ్డు గుడువఁగ మింటన్.

226


చ.

పిడుగుల పెల్లుగూల్చి వెనువెంబడె ఖడ్గగదాస్త్రశస్త్రము
ల్దడబడ చిత్తజల్లులవిధంబున పైనిగిడింప నబ్బలుం
డడలుచు లాంగలంబు ముసలాయుధము న్వడి ద్రిప్పి వానిపె
ల్లడఁపగ కాలుఁడై నిముస మార్పఁగలేక చలించి ఖిన్నుఁడై.

227


మ.

ఇది యేమో బలువింత బుట్టె వినుతుం డెవ్వండొ దౌర్జన్యుఁడై
యెదురున్ లేక నభంబున న్నిలిచి నేఁ డీలాగు మాయారణం