도)SE_OT స్వీయ చరిత్ర ము నానుసారముగానైనను 1872వ సంవత్సరపు 8.వ సంఖ్య రాజశాసనాను సారముగానైనను జరపవచ్చుననియు, వితంతుశరణాలయములో విద్యనిమిత్తము వితంతువులు కానివారిని సహితము చేర్చుకోవచ్చుననియు, ఏర్పాటుచేసితిని. ఈ నిక్షేపపత్రము దీని కనుబంధముగా కడపటం బ్రకటింపఁబడియున్నది. నా జీవితకాలములో పుస్తక విక్రయమువలన వచ్చెడిదితప్ప నా సా-తీవునకయి నేనేమియు నుంచుకోలేదు. చెన్నపట్టణములోనున్నయిండ్లనుసహిత మమ్మివేసి దానిని సహితము రొక్కముగా నిచ్చివేసితిని. చేన్జిరాఫ్ట్లు పెదబాపయ్యగారి దృష్టాంతమును బట్టి యిద్దఱు ముగ్గురు తరుణవయస్కు లనుష్టానిక బ్రాహ్మలగుటతటస్థించినది. బాపయ్యగారియింట సార్వజనీనమైన సంస్కార భోజనము జరిగిన దినముననే భోజనమునకు ముం దక్కడకు వచ్చినవారితో నేను స్థిరముగా నిలువఁగలిగిననే భోజనమునకు రావలసినదనియు లేనియెడల పోవలసినదనియుసృష్టముగాఁజెప్పితిని.మాకేమియు భయము లేదని యప్పడు మహాభైర్యముతో మొదటఁజెప్పినవారే బంధువులు బాధించినప్పడు ప్రాయశ్చి త్తము చేయించుకొనుటలోను మొదటివారైరి.బంధు వులకు భయపడక ప్రాయశ్చిత్తమునకులోను గాక నిలిచినవారిలో నొకరు కారు వూరి -కామరాజు"గారు. ఆయనకు స్వగృహములేక పోవుటచేతను కాపురమున్న యింటివారు లేచి పొమ్మని యొత్తుడు చేయుటచేతను మఱియొకయింటికి పోవలసి వచ్చెను. ఆల్పకాల మసౌఖ్యకరమయిన యొకయింటిలాrనుండి యిబ్బందిపడు చుండఁగాఁ జూచి నేనాతనికిపట్టణములోని చూయింటిలాగ "కాపురవుండుటకf తావిచ్చితిని ఆయింటిలోనే మా బాలికా పాఠశాలలో నుపాధ్యాయినిగా నున్న యొక యామెకును కాపురమునకు తావిచ్చితిని. వారిరువురకును సరిపడ నందున కామరాజుగారికి మాతోఁటలోనే వాసమున కిల్లిచ్చితిని. ఆనుష్టానిక బ్రాష్ట్రలలో నింకొకరు బాపయ్యగారి మేనమామయైన కామరాజు హను మంతరావుగారు; ఈయన ప్రవేశ పరీకయందు తేణినవారు. ఈయన బంధు వుల బాధ చేత ప్రాయశ్చి త్తమునకులోనయి మరల జందెము వేసి,గోవలసినవార యినను తానుచేసినపని యయోగ్యమయినదని యంతరాత్త, చాధింపఁగా *($9