పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

313



గ్రామాంతరము పోవలసినప్పుడు దారిలోఁగాని తత్సమీపమునఁగాని యేదైన స్థలవివాదముగల వ్యాజ్యమున్నదేమో విచారించి దానిని స్వయముగా చూడవలెననిచెప్పి తమకును తమ కుటుంబమునకును పల్లకులమీఁద రాక పోకల కయ్యెడు కర్చులను వ్యాజ్యదారులవలన పుచ్చుకొనుచుండిరి. ఆయన మిత్రపక్షానురక్తియు, సత్కార్యసాహాయ్యకరణాసక్తియు, కార్యతంత్ర ప్రయోగశక్తియు, విశేషముగాఁ గలవారే యయినను దాంభిక వర్త నా పేక్షయు సర్వజన ప్రియాచరణకాంక్షయు నాయనయందు ముఖ్యలోపములు గానుండెను. 1886 వ సంవత్సరము మార్చి నెల 31 వ తేదిని ప్రకటింపఁబడిన వివేకవర్ధనిలో దంభాచార్య విలసనమను ప్రహసనముయొక్క ప్రధమ భాగము ప్రచురింపఁబడినది. దానిలోని ముఖ్యపాత్రములు దంభాచార్యులును, మిత్రుఁడు జంబుకేశ్వరశాస్త్రియు, స్వామి శాస్త్రియు. అందు వర్ణింపఁబడిన లక్షణములవంటివి రెండుమూఁడీయనయందుండినవి. అందలిరెండు మూడుభాగముల నిందుఁ జూపుచున్నాను -

"స్వామి - ధాన్యము నాలుగురోజులలో వస్తవి. యిప్పుడు కొత్త ధాన్యము పుట్టి యిరవైరెండు రూపాయల కమ్ముతూవుంటే నేనుపుట్టి పదహారు రూపాయలచొప్పున పదిగరిశల ధాన్యముకు జట్టీయిచ్చినాను. వాళ్లకు మన ఆఫీసులో వ్యవహారంవుండబట్టి ఆధరకు యిచ్చినారు కానండి లేకపోతే యిరవైరెండురూపాయలకు చిల్లిగవ్వ తక్కువ యివ్వరు. మన ధాన్యం చేరే వరకూ మీరు వాళ్లవ్యవహారం పరిష్కరించకూడదు. వాళ్ల జుట్టు మనచేతిలో నుంచి తప్పిపోతే మళ్లీ ధాన్యంరావు. ధాన్యంవచ్చేదాకా మీరు పోస్టుపోను చేసి తిప్పుతూవుండవలెను. మీకన్ని ధాన్యము అక్కరలేకపోతే మనం బజారులో యిరవయిరెండు రూపాయలకాడికి యెవరికైనా అమ్మివేయవచ్చును.

జంబు - స్వామిశాస్త్రులుగారు సప్లయిలు మహా బాగా చేయిస్తారు. మాకుకూడా యీధరకు రెండుగరిశల ధాన్యము యిప్పిస్తురూ.