పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

స్వీయ చరిత్రము.



చేసి సొమ్మపహరింతురని యాయన చెప్పెనుగాని సొమ్మపహరించిన యెడల ఆనష్టమును నేను భరించెదనని పలికి సొమ్మిప్పించి యావృద్ధబ్రాహ్మణు నక్కడి నుండియే పంపివేసితిని. చెంచలరావు పంతులుగారితో కొంతసేపు సంభాషించినతరువాత నాయనను వీడ్కొని బైలుదేఱి, తిన్నఁగా, రఘునాథరావుగారి యింటికిఁబోయి యాయనను సందర్శించి "మీరు నిన్నటిదినమున వధూవరులు దొరకినపక్షమున స్వాములవారి యింటియెదుటనే వివాహము జరపించెదమని సెలవిచ్చితిరి. ఈశ్వరుఁడు మీయభీష్టమును శీఘ్రముగానే సిద్ధింపఁజేయునట్లున్నాఁడు. వధూవరులను గొనివచ్చుటకయి ప్రయాణవ్యయములకిచ్చి యొక మనుష్యుని నేనిప్పుడేపంపించితిని." అని చెప్పితిని. ఈ కడపటి వాక్యమును ముగించునప్పటి కాయన ముఖము కళావిహీనమయి వైవర్ణ్యము నొందెను. ఆయనచేతులు జోడించి నాకు నమస్కారముచేసి, "ఈపక్షమున పనిచేసినందునకు నేనీవఱకే బహుబాధలుపొందితిని. నేనిఁక దీనిలో సంబంధము కలిగించుకొనఁజాలను. క్షమింపుఁడు" అని స్పష్టముగాఁబలికిరి. నేనప్పటికాయనను వీడ్కొని బండిలో నింటికిఁబోయితిని. నాతోఁ జెప్పినట్లా ముసలాయన నాలుగైదుదినములలో వధువులనిద్దఱిని వారి జననీజనకులను వరులనిద్దఱును తీసికొనివచ్చి నాకప్పగించి తనదారినిపోయెను. ఆయన మరల నాకంటఁ బడలేదు. తరువాత విచారింపఁగా నావృద్ధవిప్రుడు వధువుల మాతామహుఁడయినట్లు తెలియవచ్చెను. వెనుకటివలె నంతవిజృంభణముగాచేయక మాచేతనున్న వేయి రూపాయలనుమాత్ర మీరెండు వివాహములకును వ్యయ పెట్ట నిశ్చయించుకొని ఆవధూవరుల కుటుంబమును బ్రహ్మసమాజ మందిరమునందుంచి, నామిత్రున కావిషయమును దెలిపితిని. చెంచలరావు పంతులుగారును రఘునాథరావుగారును నావద్దకువచ్చి యీవివాహములను చెన్న పట్టణములో జరపవలదనియు, తాము రాకపోయినయెడల తమ పేరుచెడుటయేకాని వివాహపక్షమునకేమియు లాభము కలుగదనియు, అంతేకాక తామీపక్షమును విడనాడినట్టు జనులకు తెలిసినపక్షమున ముఖ్యులు విడిచిరని యీపక్షమునకు నష్టమే కలు