పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

స్వీయ చరిత్రము.



గకపోలేదు. ఆనాటకములయందలి పాత్రములు విస్తారముగా పాఠశాలలోని విద్యార్థులు. నాటకములలో వేషములు వేయుట గౌరవహానికర మని యనేకులయభిప్రాయ మగుటచేత విద్యార్థులసంరక్షకులు తమబాలురచేత వేషములు వేయించినందునకయి నామీఁద నభియోగము తెచ్చెదమని నన్ను బెదరించిరి. నాటక ప్రదర్శనమువలన విశేషలాభము కలుగు ననియు నీతి వృద్ధియగుననియు నేను దలఁచి యుండినను, విద్యార్థులు నాటకము లాడుటయందలి యుత్సాహముచేతఁ దమపాఠములయం దశ్రద్ధను జూపునట్లు కనఁబడి నందున నాటకసమాజములయం దటుతరువాత నే నంతగా నాదరము చూపుచు రాలేదు.

1881 వ సంవత్సరమునందు మావిద్యార్థుల సంఘసంస్కరణసమాజము సహితము మిక్కిలి యుత్సాహముతోఁ బని చేయుచుండెను. నేను విద్యార్థిని గాకపోయినను సామాజికులలో నొకఁడనుగాఁ జేరి వారు చేసెడి ప్రతిసభకును బోయి ప్రోత్సాహపఱుచుచుండెడివాఁడను. ఈసమాజమునకుఁ గార్యదర్శి పెద్దిభట్ల వేంకటప్పయ్యగారు. ఆయనయప్పుడు పట్టపరీక్షతరగతిలోఁ జదువు కొనుచుండెడివారు. ఆసమాజములోఁ జేరినవారు తాము చుట్టలు త్రాగుట పొడుముపీల్చుట మొదలయిన దురాచారములు మానుటకును బోగము మేళముల యాటపాటలకుఁబోవ కుండుటకును సమస్తసంఘసంస్కరణముల యందును తోడుపడుటకును ప్రతిజ్ఞలను గైకొనిరి. వారితో నేను సహిత మాప్రతిజ్ఞలనుగైకొంటిని. అప్పుడు విద్యార్థులుగానుండి ప్రతిజ్ఞలు గైకొన్న పెద్దిభట్ల వేంకటప్పయ్యగారు మొదలయినవారు క్రమక్రమముగా తామున్నత స్థితికివచ్చి లౌక్యాథికారధూర్వహులయినతరువాత సహితము బాల్యము నందుఁ జేకొన్నప్రతిజ్ఞల నతిక్రమింపక మరణపర్యంతమును పాలించుచు వచ్చిరి. అట్లు ప్రతిజ్ఞాపాలనము చేయుచున్నవారిలో నేనొక్కఁడను. నేను బాల్యమునుండియు ప్రబలమైన ---చేత బాధపడుచున్న వాఁడను. చుట్ట