మూడవ ప్రకరణము.
89
వున్నవి. ఎవరూ చదువుకోని పక్షమున తప్పుదస్తావేజు లేలాగుపుట్టునో బుద్ధిమంతుల కందఱకూ తెలుసును. కాఁబట్టి మేము యీవిషయములో విస్తరించి వ్రాయవలసినపనిలేదు. ఈవక్కదృష్టాంతమే పురుషులకు విద్యా కూడదనుటకు చాలినంతప్రబలయుక్తిగానున్నది. విద్య చదువుకోవడంవల్ల ప్రయోజనమేమి? పూర్వకాలపువారందఱూ విద్యచదువుకోక పోయినందుచేత చచ్చి పోయినారా ? చదువుకోకపోతే జీవనంజరగదా? కాలిమీఁద కాలువేసుకొని కలిగిన మాత్రంతో సుఖంగా కాలక్షేపం చెయ్యలేక, తీరికూర్చుండి విద్యపేరు పెట్టుకుని వృధాగా శ్రమపడడం యెందుకు? దొరతనంవారు మనగ్రామాలలో బళ్ళు పెట్టించి పిల్ల వాళ్ళను పాడుచేస్తూవుండగా దేశాభిమానంగల వారందఱూ చూస్తూ వూరుకోవడం న్యాయమా ? దొరతనంవారికి అందరూచేరి మాకు విద్యవద్దని మహజరు అర్జీలను పంపించుకోరాదా ? పెద్దలందఱూ సభచేరి, మనశిష్టాచారానికి విరోధంగా చదువుకొనేవారిని వెలివేస్తామని గట్టిగా కట్టుదిట్టములు యేర్పఱిచి విద్యమాన్పరాదా ? ఇంగ్లీషువారు చదువుకొని బాగుపడలేదా అంటారేమో, వారు తెల్లనివారు; మనము నల్లనివాళ్ళము. మనకు విద్యయెందుకు ? హిందువులందరూ చదువుకోవడంలేదా అంటే, వారికీ మనకూ చాలా భేదంవున్నది. వారు గ్రామాలలో వుండేవారు; మనము కొండలలో వుండేవాళ్ళము. కాఁబట్టి మనకు చదువుపనికిరాదు. పూర్వపువాళ్ళు యీమాత్రం యెరగకనే విద్యమానివేసినారా ? వారికంటె యిప్పటివాళ్ళు మహాబుద్ధిమంతులా ? ఇటువంటివిపరీతబుద్ధులు పుట్టుచున్నవిగనుకనే యీ కాలపువాళ్ళందరూ అల్పాయుష్మంతులుగా వుంటూవున్నారు."
నేను ధవళేశ్వరమును విడిచి వచ్చినతరువాత మరలఁ బనిలోఁ బ్రవేశింపవలెనన్న యుద్దేశము లేకపోయినను, 1876 వ సంవత్సరము నవంబరునెల మొదటితేదిని రాజమహేంద్రవరమునందలి రాజకీయశాస్త్రపాఠశాలలో నెల కిరువదియైదు రూపాయల జీతముగల యాంధ్ర ద్వితియోపాధ్యాయపదము నందుఁ గుదురవలసినవాఁడ నైతిని. మొట్టమొదట నా కీపనిని దయచేసెద