పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు గాని
దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకువిదల్పదీ భరతమేదిని ముప్పది మూడు కోట్లదే
వతలెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులార్తురే '

అంటూ ధనవంతుల అపవ్యయాన్ని ఎండగట్టారు.

దీనుల పట్ల, సంఘం అణచివేసిన వారి పట్ల అపారమైన సానుభూతితో కలం కదలించిన కవి జాషువా గారు సంఘ సంస్కరణ ఆయన కావ్య లక్ష్యం; ఆకలిని శోకాన్ని నిర్మూలించాలన్నదే ఆయన ధ్యేయం. అంధ విశ్వాసాలను, మత విద్వేషాలను తీవ్రంగా నిరసించారు. చిత్తశుద్దిలేని పెత్తందార్లను, గుత్తస్వాములను నిలదీసి ప్రశ్నించాలంటూ

" ముసుగులో గుద్దులాటలు పొసగవింక హక్కు గలదయ్య ప్రశ్న సేయంగ నిన్ను " అంటూ దేవుణ్ణే నిలదీసి ప్రశ్నించాడాయన.

జాషువాగారు అభ్యుదయ వాది. వర్గ సంఘర్షణ, ఆర్ధిక వ్యత్యాసాల నిర్మూలన దోపిడీ వర్గాలపై తిరుగుబాటు జాషువాగారి కావ్యాలలో నిండుగా వున్నాయి. రేడియోలో వస్తున్న కవితలను విమర్శిస్తూ, అన్నార్తుల ఆక్రందనను తనకవితలో యిలా వినిపించారు.

' రేయిబవలు భారతీయ సంస్కృతీ పేర
గండశిలలు చూపి కథలు చెప్పి
కటిక పేదవాని కడుపులోగల చిచ్చు
గడపగలవే నీవు గగనవాణి '

ఆస్తి అందరిదీ కావాలని కొందరికే పరిమితం కారాదనీ ఆయన అభిమతం

స్వరాజ్యం సంపాందించి మూడేళ్లు గడిచినా ప్రజల బ్రతుకులు మారలేదేమి? అంటూ,

' మారు పల్కవేమి మంతిరన్నా ' అని నిలదీసి అడిగారు.

జాషువాగారు సంకుచిత తత్వాలను ఖండిస్తూ, ' నిఖిలలోకమెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వనరుడ నేను ' విశ్వజనీనమైన దృక్పథం గల వాడాయన

గబ్బిలం పట్ల జాలిని చూపుతూ,

" నరుని కష్టపెట్టి నారాయణుని గొల్చు
ధర్మశీలురున్న ధరణి మీద
కాలుమోపలేక గబ్బిలమొక్క టే
చరణ యుగళిదివికి సాచి నడుచు. "

' స్మశాన వాటిక ' లోని ప్రతి పద్యం మన గుండెలను పిండుతుంది. ఇచ్చోట; నే సత్కవీంద్రుని కమ్మని