పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రైస్తవ కళాశాలలో డా. మిల్లర్ అంతేవాసిగ అధ్యయనం సాగించారు.

సంఘం ఆధ్యాత్మికంగా ముందంజ వేయాలని విశ్వసించిన నాయుడుగారు సూఫీ వేదాంతాన్ని, హిందూ క్రైస్తవ మత సిద్ధాంతాలను బాగా ఆకళించుకొన్నారు. అసాధారణమైన జ్ఞాపకశక్తి గల నాయుడుగారు ఆంధ్రాంగ్ల భాషలలో అనర్గళంగా ఉపన్యసించేవారు.

కందుకూరి వీరేశలింగం పంతులుగారి సాహచర్యం కారణంగా విధవా వివాహాలను బలపరచసాగారు. బ్రహ్మసమాజ సిద్ధాంతాల పట్ల శ్రద్ధాసక్తుల కారణంగా విశ్వైక మత ప్రచారానికి, మానవతా ప్రబొధానికి కంకణం కట్టుకొన్నారు.

1884లో బి.ఎ. మొదటి సంవత్సరం విద్యార్ధిగా వున్నపుడే శేషమాంబ గారిని వివాహం చేసుకున్నారు. 1889 లో ఆమె ఆడబిడ్డను ప్రసవించి మరణించారు. ఆమె మరణించిన తర్వాత నాయుడుగారు మరలా వివాహం చేసుకోలేదు. ఆనాటి నుండి హిందూ వితంతువుల మాదిరిగా వుండాలని సదా తెల్లని దుస్తులే ధరించేవారు. అందువల్లనే నాయుడుగారిని ' ఆంధ్ర దేశ శ్వేతాంబర ఋషి ' అనేవారు.

నాయుడుగారు ఏలూరు సి.యం.ఎస్. హైస్కూలులోను, రాజమండ్రి, బందరు పట్టణాలలోని హైస్కూళ్ళలోనూ ఉపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా పని చేశారు. 1891 లో ఎం.ఎ. (ఆంగ్ల సాహిత్యం) పట్టభద్రులై కొంతకాలం మద్రాసు పచ్చియప్ప కాలేజీలో ఆంత్రోపాలజీ ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేశారు.

1904 లో పిఠాపురం రాజావారి కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ స్వీకారం చేశారు. కళాశాలలో స్త్రీలకు, దళిత జాతుల విద్యార్థులకు ఉచితంగా విద్య నేర్పబడేది. 1911 లో మొట్టమొదటి సారి బాలికలను కళాశాలలో చేర్చి సహవిద్యకు మార్గదర్శకులైనవారు నాయుడుగారు.

1905 నుండి 1929 వరకు పి. ఆర్. కళాశాల ప్రిన్సిపాల్ గా నాయుడుగారు గొప్ప సేవలందించారు. మహారాణీగారు కళాశాలకు కావలసిన భవనాలకు లక్షలు విరాళం గాను, 35 ఎకరాల స్థలం క్రీడలకు గాను దానం చేశారు. కళాశాలలో వారికి గల సాన్నిహిత్యం గురించి చెబుతూ, " నా హృదయాన్ని అరంగుళం చీల్చి చూడండి. అక్కడ మీకు పిఠాపురం రాజా కళాశాల కనిపిస్తుంది." అన్నారు.

1925లో నాయుడుగారు మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులుగా నియమింపబడినారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ బిల్లును రూపొందించి శాసన మండలిచే ఆమోదింప చేసిన మహనీయులు వెంకట రత్నం నాయుడుగారు. 1927లో ఆంధ్ర విశ్వ విద్యాలయం మొదటి పట్ట ప్రదానోత్సవంలో నాయుడుగారిని గౌరవ డాక్టరేట్ పట్టముతో సత్కరించింది.

నాటి ఆంగ్ల ప్రభుత్వం నాయుడుగారిని దివాన్ బహదూర్, కైజర్-ఇ-హింద్, 'సర్' బిరుదాలతో గౌరవించింది.

ఆయన దయామయుడు. ఎందరో అనాథ బాల బాలికలను చేరదీసి వారికి