పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రులకు చిరస్మరణీయుడైన ఆంగ్లేయుడు

సి.పి. బ్రౌన్ (1798 - 1884)

భారత దేశ చరిత్రలో ఆంగ్లపాలనా కాలం అనటం కంటే ఆంగ్లపాలకుల దోపిడీ కాలం అనటం సమంజసంగా వుంటుంది. రాజకీయ బలాన్ని మరింత లాభములకు వినియోగింపవలెనన్నదే నాటి కంపెనీ ప్రభుత్వ లక్ష్యం. మరుభూములలో మంచినీటి