పుట:Sukavi-Manoranjanamu.pdf/515

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కామారిః అంటే శివుడుగాని, శివారిః అంటే కాముడుగాడు. నాగారిః = సింహము, కాని సింహారిః = ఏనుగుకాదు. అనగా నోడినవారికి అరి, విరోధి ప్రభృతిశబ్దములు చెల్లవు, జయించినవారికి చెల్లును. ఇంద్రునికి పర్వతము లోడినవి గాని పర్వతముల కింద్రు డోడలేదు. సురాసురులకు సమానముగాన వారి కొకరి కొకరికి పరస్పరము చెల్లును. అమరమునందు బర్హిర్ముఖాః క్రతుభుజో గీర్వాణా దానవారయః' అని (దానవారయః) = రాక్షసులకు శత్రువులని చెప్పినారు. మరియు "శుక్రశిష్యాదితిసుతాః పూర్వదేవా స్పురద్విషః" అని (సురద్విషః = ) దేవతలకు శత్రువులని చెప్పినారు. కావున “నభస్వదశనారాతి ధ్వజాగ్రజః విరోధీ యేషాం తే" అని బహువ్రీహి చెప్పితే యుక్తముగా నుండును. మూల వ్యాఖ్యానములందు షష్ఠీ తత్పురుషమే వ్రాసినారు.546

ప్రతాపరుద్రీయమందు చెప్పబడిన అర్జదోషములలో 'అతిమాత్ర' మన్న దొకటి.547

'యత్సర్వలోకాతీతం త, దతిమాత్రం ప్రకీర్త్యతే' అని లక్షణము చెప్పి —

మా భూ దేకార్ణవం విశ్వ, మితి సంకోచితాశ్రుభిః
అరణ్యే హూణ నారీభిః, అసంఖ్యా నిమ్నగాః కృతాః (దోష. 54)

అని లక్ష్యము చెప్పినారు. ఇది దోషమైతే

పారిజాతాపహరణము (1-10)
ఉ.

రాజుల సేతయుం బరశురాముఁడు నంతలు సేసె రెండుమూఁ
డీ జగతిం గణింప నది యెంతటి విస్మయ మంచు, నీ సుహృ
త్తేజుఁడు కందుకూరికడ తిమ్మయ యీశ్వరుచేఁ జనించె మో
రాణి బెడందకోట యవనాశ్వికరక్తనదీసహస్రముల్.

548
వసుచరిత్రము (1–74)
మ.

జలధిన్ దానపయోనదీఝరులచే చంద్రున్ యశోలక్ష్మిచే
జలదవ్రాతము నాత్మకారితమహాసత్రాగ్నిధూమంబుచే